Home » Puttaparthi
దశాబ్దాలుగా అభివృధ్దికి నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేతలు మారినా తమ తరలరాతలు మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామాలకు సరైన రోడ్లు లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లోకి కనీసం అత్యవసర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది.
పట్టణంలోని తేరుబజారులో ఉన్న ఆర్య వైశ్య కొత్తసత్రంలో గోదారంగ నాథస్వామి కల్యాణోత్సవాన్ని శ్రీరామభజన మందిరం ఆధ్వ ర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం సుభి క్షంగా సుఖశాంతులతో ఉండా లన్న తలంపు తో ఈ కార్యక్ర మాన్ని నిర్వహించామని నిర్వాహకులు కోటి లక్ష్మీవెంకటేశ్వర్లు, దేవతా కృష్ణమూర్తి పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ యువ నా యకుడు మంత్రి నారా లోకేశ జన్మదినం సందర్భంగా శుక్రవారంం కది రి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పా టు చేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.
ఉద్యోగభద్రత సర్క్యులర్ 1/19ను అమలు చేసే వరకు పోరాడుతామని ఎనఎంయూ రీజనల్ చైర్మన ముత్యాలప్ప, జోనల్ వైస్ ప్రెసిడెంట్ నాగశేఖర్ తెలిపారు. ఈ మేరకు జోనల్ కమిటీ పిలుపు మేరకు జోనల్ వ్యాప్తంగా ఉన్న సమస్య లపైనా, కడప డీపీటీఓ మొండి వైఖరికి నిరసనగా గత 66 రోజులుగా కడపలో నిరాహార దీక్షలు చేపట్టారన్నారు.
చౌకడిపోలకు బియ్యం తరలించే లారీ గురువారం మండలకేంద్రంలోని నాగలకట్ట సమీపంలో రోడ్డుపై ఆగిపోయింది. అది కదిరి- రాయచోటి ప్రధాన రోడ్డు కావడంతో... ఆ రోడ్డు వాహనాల రాకపోకలు పూర్తిగా రెండు గంటలపాటు నిలిచిపోయాయి. రోడ్డుకిరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
దాదాపు యాభై ఏళ్ల క్రితం వారపుసంత నిర్వహించేందుకు మండలకేంద్రానికి కూతవేటు దూరం లో సంతగేటు కాలనీ ఏర్పాటైంది. ఎంతోమంది నిరుపేదలు అక్క డ ఇళ్లు నిర్మించుకుని నివాసాలుండేవారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, ప్రస్తుతం 20కి పైగా కుటుంబాలు ఉన్నాయి. 150 మం దికిపైగా జనం నివసిస్తున్నారు.
మండలకేంద్రంలో మురు గునీటి సమస్య తిష్టవేసింది. వీధుల్లోనే మురుగునీటితో కలిసి వృఽథానీరు పారుతోంది. మండల కేంద్రంలో అక్కదేవతల గుడి నుంచి సర్పంచ భారతి ఇంటి వెనుక భాగం మీదుగా పుట్టపర్తి ప్రధాన రోడ్డు వరకు, బీసీకాలనీ, పాతబాలాజీ పాఠశాల వెనుక వరకు మురుగునీటి కాలువ ఉంది.
మండలంలోని చింతలపల్లి, వసంతపురం గ్రామాలకు వెళ్లే రహదారులు ఆధ్వానంగా తయారుకావడంతో కూటమి ప్రభుత్వం నూతన బీటీ రోడ్లుకు రూ. 2.6కోట్లు నిధులు మంజూరు చేసింది.
స్థానిక ఎంపీడీఓ కార్యా లయం సమావేశ భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎంపీపీ గిరక రమాదేవి అధ్యక్షతన ‘మన పల్లె- మన నీరు’ అనే కార్యక్రమంపై నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు తమ శాఖల ద్వారా జరిగే పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లు వివరించారు.
రాష్ట్ర అభివృద్ధిపై స్పష్ట మైన విజన కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్లో మహిళా శిశుసంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ సమావేశంలో ఆమె బుధవారం పాల్గొని మాట్లాడారు.