Share News

MLA: నేడు మెగా రక్తదానం శిబిరం :ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:07 PM

తెలుగుదేశం పార్టీ యువ నా యకుడు మంత్రి నారా లోకేశ జన్మదినం సందర్భంగా శుక్రవారంం కది రి పట్టణంలోని పీవీఆర్‌ ఫంక్షన హాల్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పా టు చేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు.

MLA: నేడు మెగా రక్తదానం శిబిరం :ఎమ్మెల్యే
Speaking MLA Kandikunta

కదిరి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ యువ నా యకుడు మంత్రి నారా లోకేశ జన్మదినం సందర్భంగా శుక్రవారంం కది రి పట్టణంలోని పీవీఆర్‌ ఫంక్షన హాల్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పా టు చేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. ఆయన తన నివాసంలో గురువారం మాట్లాడుతూ... ఉదయం 9గం టలకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నియోజక వర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ తరలివచ్చి రక్తదా నం చేసి, శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోపూరిశెట్టి చంద్రశేఖర్‌, రాజశేఖర్‌ బాబు, డైమండ్‌ ఇర్ఫాన పాల్గొన్నారు.

ధర్మవరం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ జన్మదిన వేడుకలను విజయవంతం చేద్దామని ఏపీసీడ్స్‌ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య, నియోజకవర్గ టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జ్‌ చింతలపల్లి మహేశచౌదరి పిలుపు నిచ్చారు. వారు గురువారం టీడీపీ స్థానిక ఎర్రగుంట్ల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ జన్మదిన వేడుకలను శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహి స్తామని, పట్టణల, మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్దఎ త్తున తరలిరావాలని కోరారు. పార్టీ కార్యాలయంలో కేక్‌కట్‌ చేసి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 22 , 2026 | 11:07 PM