Home » Punjab
పంజాబ్ లుధియానాలోని ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలో సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల చేదు అనుభవాలను చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన పంజాబ్లో ఈనెల 26న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు శుక్రవారంనాడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఘనివిజయం సాధించింది.
పంజాబ్లోని అబోహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించింది. 50 వార్డుల్లో 28 వార్డులు సొంతం చేసుకుంది.
డ్రగ్స్ కేసులో పంజాబీ సింగర్ హర్బీర్ సింగ్ సోహాల్ అరెస్టయ్యాడు. కారులో హెరాయిన్ తరలిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. కారు నుంచి 5.1 కేజీల హెరాయిన్, 1.50 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పది సీట్లకు మించి గెలవలేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. లిఖితపూర్వకమైన లెక్కలతో ఆయన ఈ జోస్యం చెప్పడం విశేషం.
రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరాను అరెస్టు చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆయనను అరెస్టు చేసింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా నోట్ల కట్టలతో నిండిన సంచులు దొరికినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ టవర్స్లోని ఓ ఫ్లాట్లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం.
పంజాబ్లో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. రెండు గంటల్లో రెండు వరుస పేలుళ్లతో పంజాబ్ దద్దరిల్లింది. జలంధర్ పేలుడు వెనుక తమ హస్తముందని ఖలిస్థానీ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
పంజాబ్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. నిన్న (బుధవారం) రాత్రి జలంధర్, అమృత్సర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా పేలుళ్లు జరగడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్పై పంజాబ్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.