Home » Punjab
పంజాబ్ పఠాన్కోట్ జిల్లాలోని ఫాంగ్టోలి గ్రామంలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో పోలీసులతోపాటు భద్రతాధికారుల వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఉన్నతాధికారులు జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు.
వారీస్ పంజాబ్ దే అధ్యక్షుడు, ఖదూర్ సాహెబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ చన్నీ మండిపడ్డారు. లోక్సభ సభ్యుడిగా గెలిచిన అమృత్ పాల్ సింగ్ను నిర్బందంలో ఉంచడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
'ఉచిత' హామీలతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శనివారంనాడు శ్రీకారం చుట్టింది. ఉచిత విద్యుత్- 24 గంటల నిరంతర విద్యుత్, ఉచిత వైద్య చికిత్స, ఉచిత విద్య, మహిళలకు రూ.1000 చొప్పన ప్రతినెలా ప్రోత్సాహకాలు, యువకులందరికీ ఉద్యోగం వంటి 5 హామీలను ప్రకటించింది.
హర్యానా, పంజాబ్లను వేరుచేస్తూ శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన దిగ్బంధాలను హర్యానా ప్రభుత్వం తొలగించడంతో మరోసారి రైతులు ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జంతర్మంతర్లో కానీ, రామ్లీలా మైదానంలో కానీ శాంతియుత నిరసనలకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ మంగళవారం తెలిపారు.
వర్షాకాలం వచ్చిందంటే కొంత మంది బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. భారీ వర్షం కురిస్తే చాలు నీరు అంతా ఇంట్లోకి వచ్చేస్తోంది. ఇక, ఆ వరద తగ్గే వరకు ఆ నీటిలోనే మనుగడ సాగించాల్సి ఉంటుంది.
అతివాద సిక్కు బోధకుడు, ఖాదూర్ సాహిబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ సోదరుడు హర్ప్రీత్ సింగ్ డ్రగ్స్తో పట్టుబడ్డాడని జలంధర్లో పోలీస్ ఉన్నతాధికారి శుక్రవారం వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పంజాబ్లోని లుధియానాలో శివసేన లీడర్ సందీప్ థాపర్పై జరిగిన కత్తి దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖలిస్తాన్ వ్యతిరేకి అయిన ఆయనపై నిహాంగ్ సిక్కులు...
పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉంటే లూథియానా ప్రభుత్వాసుపత్రి వెలుపల శుక్రవారం మధ్యాహ్నం ఈ దాడి ఘటన చోటుచేసుకుంది.
భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గుర్తించడంతో బుధవారం హైఅలెర్ట్ ప్రకటించారు.