Home » Protest
ఇవాళ మళ్లీ పంజాబ్ రైతుల బృందం తమ డిమాండ్లతో ఢిల్లీకి పాదయాత్ర చేస్తోంది. ఈ క్రమంలో రైతులను ఢిల్లీ వైపు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఢిల్లీ-హర్యానా శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా శుక్రవారం బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపిచ్చింది. బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా సరిహద్దుల్లో రైతుల నిరసన నేపథ్యంలో పోలీసులు నిఘాను కఠినతరం చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రైతులు పెద్ద ఎత్తున మహామాయ ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకోవడంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
రైతులు మరోసారి ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు (డిసెంబర్ 2న) దాదాపు 10 రైతు సంఘాలు ఢిల్లీలో అడుగుపెట్టనున్నాయి. పార్లమెంట్ను ముట్టడిస్తామని రైతులు ప్రకటించారు. ఇదే సమయంలో వీరిని ఆపడానికి పోలీసులు పూర్తి సన్నాహాలు చేశారు.
కోల్కతాలోని మానిక్తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కల్తీ ఆహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధినిల ఆందోళన నేపథ్యంలో బాధ్యుడైన హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించి, త్వరితగతిన నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు వెలుపల పోలీసు వ్యాను నుంచే కృష్ణదాస్ తన అనుచరులకు విక్టరీ సంకేతాలిస్తూ, ఐక్య బంగ్లాదేశ్ను తాము కోరుకుంటున్నట్టు సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం, నాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తు్న్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధిర్ జైశ్వాల్ పేర్కొన్నారు. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించామని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.
మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని.. కేటీఆర్కు మహబూబాబాద్కు వచ్చే అర్హత లేదని.. కేటీఆర్ గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహబూబాబాద్లో దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం మహబూబాబాద్లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తుంది.