Home » Protest
కోల్కతాలోని మానిక్తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కల్తీ ఆహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధినిల ఆందోళన నేపథ్యంలో బాధ్యుడైన హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించి, త్వరితగతిన నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు వెలుపల పోలీసు వ్యాను నుంచే కృష్ణదాస్ తన అనుచరులకు విక్టరీ సంకేతాలిస్తూ, ఐక్య బంగ్లాదేశ్ను తాము కోరుకుంటున్నట్టు సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం, నాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తు్న్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధిర్ జైశ్వాల్ పేర్కొన్నారు. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించామని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.
మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని.. కేటీఆర్కు మహబూబాబాద్కు వచ్చే అర్హత లేదని.. కేటీఆర్ గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహబూబాబాద్లో దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం మహబూబాబాద్లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తుంది.
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గురువారం శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు.
లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్ఎస్ను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ అందించినట్టు సమాచారం.
పీసీఎస్ పరీక్ష డిసెంబర్ 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉండగా.. రివ్యూ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఆర్ఓ-ఏఆర్ఓ) ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 22, 23 తేదీల్లో మూడు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.
అమరావతి: విజయవాడలో నడక కోసం లయోలా కాలేజ్ వాకర్స్ పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 25 సంవత్సరాలుగా నగరవాసులు లయోలా కాలేజ్ వాకర్స్ పేరుతో లయోలా కాలేజీలో వాకింగ్ చేస్తున్నారు. అయితే కోవిడ్ సాకుతో కాలేజ్ యాజమాన్యం వాకర్స్ని కాలేజీలోకి రాకుండా ఆంక్షలు విధించింది.