Home » Prakasam
రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు.
దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్ అండ్కోదేనని ధ్వజమెత్తారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి అద్భుతమైన కృషిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.
తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ఏమాత్రం కనికరం లేకుండా దారుణంగా హత్య చేసింది భార్య. ఇందు కోసం తన తమ్ముడి సహాయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత జాకీర్ మృతిచెందారు. జాకీర్ మృతి పట్ల మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో దళితులపై దాడులు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఈ ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. వెలిగొండకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రకాశం జిల్లాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. నాగేశ్వరరావు అనే వ్యక్తి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి రిటైర్డ్ అయ్యారు.
దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడమే జగన్ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నారంటే జగన్ లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.