Home » Prakasam
దిత్వా తుపాన్ భారత్వైపునకు దూసుకొస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబై అందరినీ ఆకర్షించారు. ఈ వింత సంప్రదాయం ప్రకాశం జిల్లాలో జరిగింది.
మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు.
ప్రతిపక్ష నేత అర్హత కూడా జగన్ సంపాదించుకోలేక పోయారని మంత్రి ఆనం వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పని చేయకపోతే జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని అన్నారు.
కృష్ణా నదిలో ఎగువ నుంచి కొట్టుకుని వస్తున్న బోటును జాలర్లు గుర్తించి విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్రోన్లతో తుమ్మలపాలెం వద్ద బోటుని గుర్తించారు.
భారీ వర్షాల కారణంగా చీరాల నుంచి పాకాల వరకు ఉన్న లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చీరాలలో చేనేత మగ్గాలు కూడా నీట మునిగిపోయాయి. రబీ సీజన్లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కోమటికుంట దగ్గర బస్సు అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు.
ప్రకాశం జిల్లాలో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కొండపిలో బస్సులో స్కూల్కు బయలుదేరిన విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈరోజు ఉదయం శాంతినికేతన్ స్కూల్కు చెందిన బస్సు.. విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్కు బయలుదేరింది.
దీపావళి పండుగ అంటే బాణసంచా కాల్చడం పరిపాటి. బాణసంచా తయారీకి తమిళనాడు రాష్ట్రంలో శివకాశి పెట్టిందిపేరు. దీంతో రెండుతెలుగు రాష్ట్రాలు కూడా శివకాశి నుంచి బాణసంచా తీసుకొచ్చి విక్రయాలు చేస్తుంటారు.
ఓంగోలు నగరంలోని తూర్పుపాలెంలో ఈ నరకాసురవధ కార్యక్రమం 1902వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పట్లో తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య అనే వ్యక్తి ఈ నరకాసురవధ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పెద్దలు చెబుతారు. ఆ ఆచారం తరాలు మారినా నేటికీ కొనసాగుతూనే ఉంది.