Home » Prakasam
కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ముగ్గురు యువకులు మృతిచెందడంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనం విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు విద్యార్థులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసినట్లు మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మహిళలందరికీ ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఒంగోలు బస్టాండ్లో ఐదు నూతన బస్ సర్వీసులను మంత్రి డోలా ప్రారంభించారు.
ఇప్పటికే ఘోర పరాజయంతో సతమతం అవుతున్న జగన్కు(YS Jagan).. సొంత పార్టీ నేతల అసమ్మతి మరో తలనొప్పిగా మారింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy). ‘నాయకులకు మా జిల్లా ఏమైనా గొడ్డు పోయిందా?..
పొదిలి(Podili) ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి(Social Welfare Minister) డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Dola Sree Bala Veeranjaneya Swamy) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బంది తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచినా ఆస్పత్రి ఆవరణలోని శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవడం, గత ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే ఫొటోలు ప్రచురించడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా దొరికిన సొత్తును అప్పగించడంలో చేతివాటం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్పై సస్పెన్షన్ వేటు పడింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చేపట్టిన ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు విజయవంతంగా సుఖాంతమైంది. దాదాపు 24 గంటల పాటు ఆ ప్రాంత వాసులను చిరుత పులి తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. చివరకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో గురువారం రాత్రి చిక్కుకుంది.
ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ చేపట్టి 24 గంటలు దాటిన చిరుత మాత్రం చిక్కక పోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి చిరుతను పట్టుకునేందుకు ఈ అపరేషన్ కొనసాగుతుంది.
ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం, దేవనగరం సమీపంలో చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్ రెండోరోజు కొనసాగుతోంది. పాత పేపర్ మిల్లు సమీపంలో ఉన్న గుంతలో నిన్న చిరుతపులి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
బాపట్ల జిల్లా: చీరాల మండలం, ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి..
ప్రకాశం జిల్లా: ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు పార్లమెంట్తో పాటు ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది.