Home » Prakasam
న్యూఢిల్లీ: మరికొద్దిసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరనున్నారు. ఆయనకు తిరుపతి ఎంపీ సీటు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. వరప్రసాద్తో పాటు రోషన్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. రోషన్కు బద్వేల్ ఎమ్మెల్యే సీటు బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.
Andhrapradesh: టీడీపీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరుతాను. ఏ రోజు టీడీపీలో చేరాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు.
Andhrapradesh: ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జ్ రవికుమార్ భేటీ ఆయ్యారు.
Prakasam News: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో(Yerragondapalem) గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రికి(Andhra Pradesh Minister) సంబంధించిన ప్రకటన ఆ పోస్టర్లలో ఉంది. దాంతో ఆ వ్యవహారం చర్చనీయాంశమైంది. మరి ఇంతకీ ఆ పోస్టర్లలో ఏముంది? ఏ మంత్రి గురించి ఆ పోస్టర్లలో పేర్కొన్నారు? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
ప్రకాశం జిల్లా: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ఫ్లోరైడ్ పీడిత బాధితులకు నీరు అందించే ప్రాజెక్టు వెలుగొండ అని, వైఎస్ రాజశేఖరరెడ్డి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని, వెలుగొండ ప్రాజెక్టు రెండు సొరంగాలు రాజశేఖరరెడ్డి కొడుకుగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లాలో సీఎం జగన్(CM Jagan) రేపు (బుధవారం) పర్యటించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
ప్రకాశం: జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందన్నారు.
బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా.. వారిలోఇద్దరు సజీవ దహనమయ్యారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏడో జాబితాను అధిష్టానం రాత్రి పొద్దుపోయిన తర్వాత విడుదల చేసింది. ఈ ఏడవ జాబితాలో ఇద్దరికి మొండిచేయి చూపించింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర రెడ్డికు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు జిల్లాలో పర్యటించారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు.