Home » Prakasam
అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.
పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హెంమంత్రి అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.
విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఏపీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
మెడికల్ కాలేజీలను ఎవరికీ దారాదత్తం చెయ్యడం లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వైసీపీ చేసిన పాప ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.
జిల్లాలో సాగర్ నీటి పంపిణీ ఈసారి గందరగోళంగా మారింది. సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా అవి బుగ్గవాగుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి 8,845 క్యూసెక్కులు ప్రధాన కాలువకు సరఫరా చేస్తున్నారు.
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆపదలో ఉన్నాడని పాపం తలచి ఫోన్ ఇస్తే అకౌంట్లలోని నగదును కాజేసే వినూత్న సైబర్ నేరాలకు పాల్పడేవారు తారసపడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు కీప్యాడ్ ఫోన్లు వాడుతుంటారు.
జిల్లాలో స్క్రబ్ టైఫస్ ప్రబలుతోంది. దానిబారినపడి ఎర్రగొండపాలెంకు చెందిన పి.దానమ్మ (61) గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు.
దిత్వా తుపాన్ భారత్వైపునకు దూసుకొస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబై అందరినీ ఆకర్షించారు. ఈ వింత సంప్రదాయం ప్రకాశం జిల్లాలో జరిగింది.