Home » Politics
కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వరి రైతులు నష్టపోయారని.. వారికి కూడా పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 10 వేలు కాకుండా ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు చేతికొచ్చిన పంటను రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు పంట కోసిన కూడా 25 శాతం వచ్చే పరిస్థితి లేదన్నారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారిక గృహాల మరమ్మతుల ఖర్చుల పరిమితులు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల గృహాల రిపేర్ ఖర్చులకు కొత్త సీలింగ్ లిమిట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గవర్నమెంట్ స్కూల్లోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ ఘటనలో ప్రధానోపాధ్యాయురాలిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
. బైపోల్ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ లో నవీన్ యాదవ్ కు మద్దతుగా సీతక్క విస్తృతంగా పర్యటించారు. నవీన్ యాదవ్ను పదే పదే రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ వాళ్లు అనడం కరెక్ట్ కాదని అన్నారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలవాలన్న దృష్టితో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఆ దిశగా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు.
కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తుపాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలిందని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్లను సుప్రీంకోర్టు సస్పెన్షన్లో పెట్టినా.. రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమని కవిత పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ నుంచి తీసేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదన్నారు.
ఉదండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను మంగళవారం ఆమె సందర్శించారు. భూ నిర్వాసితులకు ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని చెప్పారు.