Home » PM Modi
అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం తీవ్రంగానే ఉందని, ఇది కరోనా తరహా సంక్షోభ పరిస్థితి అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
పశ్చిమాసియా సంక్షోభంపై ఈ మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. యుద్ధం కారణంగా భారత్పై పడే ప్రభావం, దౌత్యపరమైన వ్యూహాలు, భారత పౌరుల భద్రతపై స్పష్టత ఇవ్వనున్నారు.
పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందన్న ప్రధాని.. పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులున్నారని, వారి రక్షణకు చర్యలు చేపట్టామని లోక్సభకు వెల్లడించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీనియర్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధానంగా కీలక రంగాలైన పెట్రోలియం, విద్యుత్, ఎరువుల పరిస్థితిపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఎలాంటి విరామమూ లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా (గుజరాత్ సీఎం పదవీకాలం సహా) పని చేసిన వ్యక్తిగా నిలిచారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.
అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్రమవుతున్న యుద్ధానికి భారతదేశమే ఏకైక విశ్వసనీయ పరిష్కార మార్గమని, ఉద్రిక్తతలను తగ్గించడంలో న్యూఢిల్లీ దౌత్యపరమైన పాత్ర పోషించాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ ఎంపీ వరుణ్ గాంధీ తన భార్య, కుమార్తెతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారంనాడు కలుసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని సిల్చార్లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేకు భూమి పూజ చేశారు.