Home » PM Modi
ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టాస్తారని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో 400 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ``ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్``ను వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను ``అటల్ సేతు`` అని పిలుస్తున్నారు. ఈ అటుల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్న ప్రశంసలు కురిపించింది. ఆ వీడియోపై ప్రధాని స్పందించారు.
దేశంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల పేర్లకంటే.. ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్(ED), సీబీఐ(CBI) సంస్థల పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ(Lok Sabha Elections) ఈ సంస్థల హాడావుడి అంతా ఇంతా లేదు. ఏమాత్రం సమాచారం అందినా.. వెంటనే రైడ్స్ జరుపుతున్నాయి. కోట్లాది రూపాయలను ఈడీ, సీబీఐ సంస్థలు..
తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసేస్తామన్న విపక్ష ‘ఇండీ’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ చట్టాన్ని ఎవరూ తీసివేయలేరని, ఏం చేస్తారో చేసుకోండని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గురువారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రె్సను గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నా రు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Telangana: రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లల్లో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. గజ దొంగల్లా బేడీలు వేశారని.. నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగిందని అన్నారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం గోసపుచ్చుకుందని.. దాన్ని ఎవరు మర్చిపోలేదన్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పీవోకేని తిరిగి భారత్లో కలుపుతామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని సిరాంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. 370 అధికరణం రద్దు తర్వాతే జమ్ము కశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయని, స్వేచ్ఛా నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు.