Home » PM Modi
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్పై రేవంత్రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సమ్మిట్కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన దేశ పౌరులకు ఓ లేఖ రాశారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను గౌరవించాలని అందులో సూచించారాయన.
మొఘలుల హయాంలో తేగ్ బహదూర్ ఎంతో సాహసం చూపించారని, కశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తుంటే దానిని వ్యతిరేకించి, కశ్మీరీ హిందువులకు అండదండగా నిలిచారని గుర్తుచేశారు.
రామభక్తుల సంకల్పం సిద్ధించిందని.. అయోధ్య రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ధర్మ ధ్వజం కేవలం జెండా కాదని.. భారత సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమని కొనియాడారు. అయోధ్య రామమందిరంలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, దేవి అహల్య, నిషదరాజు గుహుడు, శబరి మాత మందిరాలతో కూడిన సప్తమందిర్ను దర్శిస్తారు. 11 గంటలకు శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ మందిరాలను దర్శించుకుంటారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరుపుతున్నారు.
మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్కు సమున్నత చరిత్ర ఉందన్నారు.
గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని, తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు.