Home » PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(శనివారం) నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం జేవర్ సమీపంలో రూ.11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్-1 దశను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం తాలూకు ప్రకంపనలను, సవాళ్లను ‘టీం ఇండియా’లా సమష్టిగా పని చేసి అధిగమిద్దామని రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
భారత దేశంలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్యులపై భారం పడుకుండా ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు.
పశ్చిమాసియాలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ పరిస్థితి కోవిడ్ తరహాలా ఉందంటూ పేర్కొనడంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన విషాదాల గురించి ఆయన మరిచిపాయారా? అని ప్రశ్నించారు
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అధికారులతో 7 బృందాలను ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారంనాడు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించారు.
పశ్చిమాసియాలో పరిణామాలు, భారత్పై దాని ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అంతరాయం కలుగుతోందని చెప్పారు.
పశ్చిమాసియాలో తలెత్తిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 25న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేయనున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.