Home » Penukonda
కూటమి ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గీత సూచించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఈక్రాప్ నమోదు వందశాతం పూర్తయిందని, డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
మండల వ్యాప్తంగా ఉన్న రేషన షాపుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలింపును అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దన్న కోరారు. రెండు చోట్ల డంప్లు ఏర్పాటుచేసుకుని టెంపోలు, లారీలలో వాటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టు చీరలు చిరిగిపోయాయని చేనేత కార్మికులు వాగ్వాదానికి దిగారు. ధర్మవరం నుంచి సోమందేపల్లి మీదుగా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు బస్సును ఆపి, డ్రైవర్ను నిలదీశారు.
ఇన సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని శెట్టిపల్లి, కొండాపురం, రాంపురం, పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, మరువపల్లి, తిమ్మాపురం హైస్కూల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్కుమార్ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు.
సివిల్ సప్లై స్టాక్పాయింట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న డీఈఓ, సెక్యూరిటీ, పంప్ బాయ్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ డిమాండ్ చేశారు.
సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు.
అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు.