Home » Penukonda
మండలంలోని పాపిరెడ్డిపల్లి వద్దనున్న కేజీబీవీలో కోతుల బెడద ఎక్కువైంది. కొన్నేళ్లుగా కోతులు హాస్టల్ గదుల్లోకి చొరబడి విద్యార్థుల బ్యాగులోని పుస్తకాలు చిందరవందరచేస్తూ దాచుకున్న తినుబండారాళ్లను ఎత్తుకెళ్తున్నాయి.
నియోజకవర్గంలో 21వ తేదీన నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమంలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్ మంజువాణి సూచించారు.
కార్మిక సమస్యలపై 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ ఆల్ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
మండల వ్యాప్తంగా ఐదేళ్ల క్రితం మంజూరైన ప్రభుత్వ లేఅవుట్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏ లేఅవుట్లోచూసినా మట్టిరోడ్లు, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. గత యేడాది ప్రభుత్వ లేఅవుట్లను పేరు మార్చుతూ ఎన్టీఆర్నగర్లుగా ప్రభుత్వం జీవో జారీచేసింది.
రాజీమార్గం ఎంతో ఉత్తమమని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అ న్నారు. శనివారం జాతీయ మెగా లోక్ అదాలత నిర్వహించారు. 245 కేసులు నాలుగు బెంచీల ద్వారా పరిష్కరించారు.
అభివృద్ధి బాటలో సోమందేపల్లి మండలం పరుగులు పెడుతోంది. మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నారు.
కాయదశలో ఉన్న కందిపంటకు రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో విజయభారతి తెలిపారు. మంగళవారం సూచించారు. కేతగానిచెరువు, రెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.
గోరంట్ల మండలంలో అనువైన చోట యాదవ కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర యాదవ కార్పొరేషన డైరెక్టర్ కేశవయ్య గోరంట్లకు చెందిన యాదవ సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.
మండలపరిధిలోని గుత్తివారిపల్లి వద్దనున్న సాగర్ సిమెంటు గోడౌనపై విజిలెన్స ఎనఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడిచేసి గోడౌనను సీజ్ చేశారు. గుత్తివారిపల్లి వద్ద కొన్నేళ్లుగా కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తి సాగర్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా దిగుమతులు, ఎగుమతులు సాగిస్తున్నారు.
పెనుకొండ సమీపంలో ఐదు ఎకరాల్లో గిరిజన గురుకుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని నిర్మిస్తామని మంత్రి సవిత అన్నారు. సోమవారం పట్టణంలోని వసతిగృహాన్ని ఆమె ద్విచక్రవాహనంలో వెళ్లి తనిఖీ చేశారు.