Home » Peddapalli
ప్రజాస్వామ్య దేశంలో ఓటు బలమైన ఆయుధమని, ఎన్నికల సమయంలో పారదర్శకంగా వినియోగించుకొని మంచి పాలన పొందే దిశగా ముందుకు సాగాలని ఆర్డీఓ గంగయ్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన ఓటు ప్రాముఖ్యతపై ఆయన ప్రసంగించారు.
జిల్లాలో మళ్లీ ఇసుక అక్రమ దందా మొదలయ్యింది. జిల్లా అధికార యంత్రాంగం స్థానిక అవసరాలకు ఉచితంగా అందజేస్తున్న ఇసుకను గుట్టుచప్పుడుగా ఇసుక మాఫియా కమర్షియల్ అవసరాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది.
ప్రభుత్వ సం క్షేమ పథకాలు గడపగడపకు అందేలా మెప్మా సిబ్బంది, ఆర్పీలు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. శనివారం మిలీనియం హాల్లో మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని అనువుగా మార్చుకుని మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కౌన్సిలర్లు అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభి వృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శనివారం పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
ప్రతీ విద్యా ర్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించేలా ఉపాధ్యా యులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యా యులను ఆదేశించారు. శనివారం మండలంలో విస్తృ తంగా పర్యటించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధ నలను పాటించి, రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమి షనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ పీటీఎస్ లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన అరైవ్... అలైవ్ కార్యక్రమంలో సీపీ ప్రసంగించారు.
గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న వాటిని పరిష్కరించి పాలన అందించేది సర్పంచ్ చేతుల్లోనే ఉందని, దానికి ప్రభుత్వం, అధికారులు పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు.
జిల్లాలో పని చేస్తున్న 165 మంది జూనియర్ పంచాయతీ కార్య దర్శుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మేడారం తరువాత అతిపెద్ద జాతరగా గోదావరిఖని గోదావరి తీరం వద్ద జరుగ నున్న సమ్మక్కసారలమ్మ జాతరకు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు.