Home » Peddapalli
గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ డిపో కార్యదర్శి వంగర శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇన్చార్జి డీజీఎం రామన్నకు వినతిపత్రం అందజేశారు.
ప్రశాంతంగా ఉన్న మంథనిని అల్లకల్లోలంగా మంత్రి శ్రీధర్బాబు మారుస్తున్నారని, శ్రీధర్బాబు అడుగులకు మడుగులొత్తే పోలీసులను వదిలిపెట్టమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేసి గోదావరిఖని ఏసీపీ కార్యాలయానికి తరలించారు.
నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకమని, సీసీ టీఎన్ఎస్ 2.0 ఈ సాక్ష్యం అమలును వేగ వంతం చేయాలని పోలీస్ అధికారులకు రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా సూ చించారు. మంగళవారం కమిషనరేట్లో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు.
నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి, మొక్కజొన్న కేంద్రాలపై 50 రోజులు దృష్టి పెట్టానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 66 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టనున్న 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంపై చిక్కుముడి వీడ లేదు.
మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు ప్రతీ వ్యక్తి బాధ్యతగా ముందుకు రావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కోరారు. సోమవారం ఎన్టీపీసీ కాకతీయ హాల్లో అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన తనకు డబుల్ బెడ్ రూము ఇళ్లు మంజూరు చేయాలని ఎండీ షబానా డీఆర్వో రాజేశ్వరిని కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ఆమె దరఖాస్తు చేసుకోగా హౌసింగ్ ఈఈకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్, ఎస్ఎస్సీజీడీ పరీక్ష నిర్వహ ణలో లోపాలు, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మార్కుల గోల్మాల్ను నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశా రు.
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అబద్దాలు ఆడడంలో పట్టా పుచ్చుకున్నాడని రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజ లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవిం చేందుకు భరోసా కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ అం బర్ కిశోర్ ఝా అన్నారు.