Home » Peddapalli
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్ర వరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు మంగళవారం మండలంలోని జీపీ కార్మికులు ఎంపిడీవో శ్రీనివాస్కు సమ్మె నోటీస్ అందజేశారు.
బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులే పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం నిరసనకు దిగారు. యూనై టెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్లు ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గోదావరిఖనిలోని అన్నీ బ్యాంకులు సమ్మెలో పాల్గొన్నాయి.
మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తొలగించడానికి సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం పూసాల రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిగ్నల్నుడీసీపీ రాంరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు.
దేశంలోని బొగ్గు రంగ సంస్థల్లో సింగరేణి సంస్థ నంబర్ వన్గా ఉందని ఆర్జీ-1 ఏరియా జీఎం లలిత్కుమార్ అన్నారు. సోమవా రం గణతంత్ర వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి జీఎం(క్వాలిటీ) సుజాయి మజుందార్ హాజరయ్యారు.
దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామిగా, పారిశ్రామిక పురోగభివృద్ధికి ఎన్టీపీసీ ఎంతో దోహదం చేస్తోందని రామగుండం ప్రాజెక్టు ఈడీ చందన్కుమార్ సామంత పేర్కొన్నారు. సోమవారం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
చదువుతోపాటు క్రీడలకు సమయాన్ని వెచ్చించాలని ఏపీఏ జీఎం నాగేశ్వర్రావు అన్నారు. ఆదివారం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలోని బి జోన్ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను జీఎం ప్రారంభించారు.
సింగరేణిలో రూ. ఆరు వేల కోట్ల కుంభకోణం జరిగిందని, నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్ లాభాల బాటలోకి తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నష్టాల్లోకి నెట్టిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
లయన్స్క్లబ్ సేవలు మరువ లేనివని భగవద్గీత ప్రచార ఫౌండర్ డాక్టర్ ఎల్వీ గంగాధరశాస్త్రి అన్నారు. ఆదివారం దుర్గానగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వ హించిన లయన్స్క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 32వ జీ9వ రీజియన్ మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.