• Home » Peddapalli

Peddapalli

మా ఊరి పిల్లలంతా ప్రభుత్వ బడికే

మా ఊరి పిల్లలంతా ప్రభుత్వ బడికే

పెరుకపల్లి గ్రామ ప్రజలంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని శనివారం నిర్ణయం తీసుకున్నారు. మండల విద్యాధికారి పి. ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహిం చిన బడిబాటలో గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.

జీఎం కార్యాలయం  ఎదుట ధర్నా

జీఎం కార్యాలయం ఎదుట ధర్నా

సింగరేణి కార్మికులకు మెడికల్‌ బోర్డ్‌ నిర్వహించాలని, మారు పేర్ల సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయా లని శనివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జీఎం కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. గోదావరిఖని విఠల్‌ నగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ నుండి ఆర్‌జీ-1 జీఎం కార్యా లయం వరకు ర్యాలీ చేపట్టారు.

పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీ యూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వినతిపత్రం సమర్పిం చారు.

 మోదీ పాలన దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దింది

మోదీ పాలన దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దింది

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 12 సంవత్సరాలుగా దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్‌ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి, విధానపరమైన స్తబ్దతతో ఉన్న దేశాన్ని నేడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.

వలస కార్మికులకు వసతులు కల్పించాలి

వలస కార్మికులకు వసతులు కల్పించాలి

ఇతర రాష్ట్రాల నుంచి ఇటుక బట్టీ లలో పని చేసేందుకు వస్తున్న వలస కార్మి కులకు కనీస వసతులు కల్పించాలని జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి కుంచాల సునిత అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శుక్రవారం రాఘవ పూర్‌ ఇటుక బట్టీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

సింగరేణిని నామరూపాలు లేకుండా చేసేందుకు కుట్ర

సింగరేణిని నామరూపాలు లేకుండా చేసేందుకు కుట్ర

సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆర్‌జీ-1 జీడీకే ఓసీపీ-5లో శుక్రవారం బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధూకర్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించి ప్రభుత్వం చూపి స్తున్న బొగ్గు నిల్వలు లెక్కల వాస్తవాలు వివరించారు.

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి

పర్యా వరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రాంతీయ కార్యాలయం పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అసిస్టెంట్‌ సైం టిస్ట్‌ కనకజ్యోతి అన్నారు. గురువారం జ్యోతి నగర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

రామగుండంలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్‌

రామగుండంలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్‌

రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగులను పోటీపరీక్షలకు సిద్ధం చేసేందుకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యం లో హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ సమన్వయంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మేయర్‌ మహంకాళి స్వామి, శిక్షణ నిర్వాహకుడు జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మేయర్‌ చాంబర్‌లో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.

మారుపేర్లు, విజిలెన్స్‌ కేసులు పరిష్కరించాలి

మారుపేర్లు, విజిలెన్స్‌ కేసులు పరిష్కరించాలి

సింగరేణి సంస్థలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం ఆర్‌జీ-1 ఏరియా జీఎం కార్యాలయాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్‌, టీజీబీకేఎస్‌ నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు ముట్టడించారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

తరుగు పేరిట కోతలు లేకుండా ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న ఉత్పత్తులను కొనుగోలు చేశామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అన్నారు. తమ ఉనికి కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశాయని, వారికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి