Home » Peddapalli
పేద ప్రజలకు ఆస్పత్రి ఖర్చులకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరట నిస్తుందని ఎమ్మెల్యే విజయరమ ణారావు తెలిపారు. ఆర్కే గార్డెన్లో శనివారం నియోజకవర్గంలోని 238 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ 75లక్షల 88వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా విద్యాధికారి శారద పేర్కొన్నారు. మొదటి రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాల్లో 7,480 మంది విద్యార్థులకుగాను 7,473 మంది పరీక్షలు రాశారని, 99.9 శాతం నమోదైనట్లు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్ నగర్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వానరం జాతి వైరాన్ని మరిచి కుక్క పిల్లలను అక్కున చేర్చుకుంది.
రైతు లు యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరి యాను వాడాలని జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల అన్నారు. శుక్రవారం చీకురాయి రైతు వేదిక లో ఇఫ్కో కంపనీ ఆధ్వర్యంలో సహకార సంఘాల సీఈవోలకు నానోయూరియా, నానో డీఏపీపై అవగా హన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
మంథని మున్సిపల్ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దటానికి, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూతనందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు
పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన బడ్జెట్, సాధారణ సమావేశం నిర్వహించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్ అయినా నాశనం అవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. ప్రజా పాలన, పట్టణ ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత, మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై వన్టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీపీ మాట్లాడారు.
విద్యార్థులు పరీక్షలపై భయాన్ని వీడి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఏసీపీ మడత రమేష్ అన్నారు. గురువారం రామగుండం గురుకుల కళాశాలలోని పదో తరగతి విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం సలహాదారులు సురేష్ సహకారంతో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ కార్యక్ర మం నిర్వహించారు.
రామగుండం కార్పొరేషన్లో రోడ్లపై, కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. గురువారం కార్పొరేషన్ 39వ డివిజన్లోని కూరగాయల మార్కె ట్ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపుని చ్చారు.
ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరైతే విద్యార్థులు విజయం సాధిస్తారని డీసీపీ రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ హైస్కూల్లో గురువారం పోలీసులు మీకోసం కార్యక్ర మంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు.