Home » Peddapalli
రెండేళ్లకోసారి నిర్వ హించే వనదేవతల జాతర శనివారం ముగిసింది. సమ్మక్క సారలమ్మలు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయ డంతో జాతర ముగిసింది. చివరి రోజు కూడా భక్తులు జాతరకు వెళ్లి మొక్కులు సమర్పించారు.
మెజా రిటీ మున్సిపాలిటీలలో బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. సుల్తానాబాద్ లో శుక్రవారం బీజేపీ నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరికి కుష్టు వ్యాధిపై అవగాహన ఉండాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మండలంలోని రంగా పూర్, గట్టుసింగారం గ్రామాలలో సాగు చేస్తున్న ఆయిల్పామ్ క్షేత్రా న్ని శుక్రవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ట్రాక్టర్పై వెళ్ళి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రంగాపూర్, గట్టుసింగారం గ్రామాలలో రైతులు వంద ఎకరాల వరకు ఆయిల్ఫాం సాగుకు ముందుకు వచ్చారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబం ధించి చివరి రోజు శుక్రవారం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖల య్యాయి. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 1342 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటి వరకు ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు భీఫాంలు జారీ చేయలేదు.
అడ్రియాల, ఓసీపీ-2 ఉద్యోగులకు సెక్టార్-3 కాలనీలో టీటూ, టీవన్, షిర్కే క్వార్టర్లను కేటా యించేందుకు గురువారం అధికారులు క్వార్టర్ల కౌన్సెలింగ్ నిర్వహించారు.
కార్మికులకు అన్యాయం కలిగే విధంగా కొత్త లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. కాట్నపల్లి వద్ద గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులతో కలసి కొత్త లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్తో తలపెట్టిన సమ్మెకు సంబంధించిన పోస్టర్లు కరపత్రాలను వారు ఆవిష్కరించారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామి నేషన్ల దాఖలు కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం పరిశీలించింది. పరిశీలకులు కె పద్మజ రాణి, సుజాత తదితరులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి సూచనలు చేశారు.
జిల్లాలో ని మూడు మున్సిపాలిటీలు, రామగుండం కార్పొ రేషన్లో మొత్తం 440నామినేషన్లు దాఖలయ్యా యి. బుధవారం మొదటి రోజు 102నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 338మంది నామి నేషన్లు వచ్చాయి. ఇందులో రామగుండంలో 168, మంథనిలో 56, సుల్తానాబాద్లో 37, పెద్ద పల్లిలో 77నామినేషన్లు వచ్చాయి.
ఎస్సీ ఫిర్యాదులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎస్సీ పోలీసుల పదోన్నతుల్లో జాప్యంవద్దని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.