Home » Peddapalli
అణ్వాయుధాలు కాదని, ప్రపంచ శాంతి కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తెలిపారు. జాతీయ సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ప్రభావిత ప్రాంతాల్లో క్రీడాభి వృద్ధికి ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చేస్తుందని జీఎం ముకల్రాయ్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ టీఎస్లోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదా నంలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు.
మండలంలోని కొత్తపల్లి, చీకురాయి, కాసులపల్లితోపాటు పలు గ్రామాల్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం మల్లీపర్పస్ విధానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సర్పంచ్లు సన్మానించారు. కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
యుద్ధ ప్రభావం ఇటు వ్యాపారులు అటు వినియోగదారులపై తీవ్ర భారం మోపుతున్నది. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండగా గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. రామగుండం పారి శ్రామిక ప్రాంతంలో టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, భోజనశాలలు, మిర్చి బజ్జీల బండ్లు గ్యాస్ దొరకక మూతపడుతున్నాయి.
స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ పాలకవర్గం పని చేస్తుందని మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. ప్రగతి ప్రణాళిక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఆఖరి రోజున ఆదివారం సండే ఫన్ డే థీమ్తో గోదావరిఖని పుష్కర ఘాట్ వద్ద నిర్వహించారు.
మండల కేం ద్రంలోని పాండవుల గుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లు తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పాండవుల గుట్టపై జగత్ మహామునేశ్వర స్వామి ఆల యంలో వేద పాఠశాల 25 ఏళ్లుగా నడుస్తున్న సందర్భంగా మూడు రోజులుగా శత రుద్ర హోమాలు జరిపించారు.
కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బలవుతున్నారు. పది పరీక్షలు ముగియక ముందే ఇంటర్ అడ్మిషన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇంటి స్థలాలు ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం తమకు ఎప్పుడు ఇళ్లు మంజూరు చేస్తుందా అని ఇంటి స్థలాలు లేని పేదలు నిరీక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో సుమారు 42 వేల మంది ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకు న్నారు.
మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు బానిసలవుతే వారి భవిష్యత్ నాశనం అవుతుందని పెద్దపల్లి డీసీపీ భ్యూక రాంరెడ్డి అన్నారు. స్థానిక శివకిరణ్ గార్డెన్స్లో శనివారం నిర్వహించిన ప్రజాపా లన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదలు, వాటి నివారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
రామగుండంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శనివారం 52వ డివిజన్ కళ్యాణ్నగర్, కాకతీయనగర్లో కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి పెద్దనాలాలోని పూడికతీత పనులను ప్రారంభించారు.