Home » Peddapalli
భారీ వర్షాలతో ముంపునకు గురైన వరద ప్రాంతాలను గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు.
వర్షాకాల సీజన్ దృష్ట్యా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ మహంకాళి స్వామి సూచిం చారు. మంళవారం కార్పొరేషప్ కార్యాలయంలో నగర పాలక సంస్థ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావే శాన్ని నిర్వహించారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో హెచ్అండ్టీ గోదాముల ద్వారా ఒక్క సంవత్సరంలోనే ఖరీఫ్, రబీ సీజన్ల ధాన్యం కొనుగోళ్శలో సుమారు రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి ఆరోపించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు పేదలకు అందించామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.
యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్ని శాఖలు సమన్వ యంతో పని చేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వ హించిన సమావేశంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యా భివృద్ధి అంశాలపై సమీక్షించారు.
ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి వందకు వంద శాతం పూర్తి చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అధికా రులకు సూచించారు. సోమవారం సుల్తానాబాద్ మండల పరిషత్ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం జలసిరి కార్యక్ర మం చేపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. సోమవారం వీవో అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. వర్షపు నీరు వృథా కాకుండా వ్యసాయానికి ఉపయోగప డేలా రైతులు పంట పొలాల్లో ఫాంపాండ్, ఊట కుంటలు ఏర్పాటు చేసు కోవాలన్నారు.
సూపర్ ఎల్ని నో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ప్రత్యా మ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులను ఆదేశించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
నీట్ యూజీ-2026 పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి తొలి విజయమని ఎన్ఎస్యూఐ నాయకులు అన్నారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో విజయోత్సవాలు నిర్వహించారు.