Home » Peddapalli
రెండు నెలలుగా రోడ్ల నిర్మాణం లో భాగంగా పగిలిపోయిన మిషన్ భగీరథ పైపులైన్లను త్వరితగతిన మరమ్మతు చేయించాలని 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజని రవి ఇటీవల మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించారు.
ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. రూ.12 కోట్లతో నిర్మించిన ఓదెల, పెగడపల్లి ఫోర్లేన్లో రోడ్డులో భాగంగా సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్గా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు నియమితులయ్యారు. ఉగాది కానుకగా విజయరమణారావుకు ప్రభుత్వ విప్ పదవి దక్కడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుం టున్నారు.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాని వారు, పోటీ ప్రక్రియ నుంచి తప్పుకున్న నాయకులు కోఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కోఆప్షన్ పదవులు పెరుగుతాయని ఆశ పడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ మున్సిపల్ డైరెక్టర్ టీకే శ్రీదేవి కోఆప్షన్ పదవుల భర్తీకి ఆదేశాలు జారీచేశారు.
అల్లీపూర్ రైతువేదికలో ప్రకృతి వ్యవసాయం పై మంగళవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. చిన్నబొంకూరు, రెబ్బల్దేవ్పల్లి, మియాపూర్ నుంచి 125 మంది రైతులు పాల్గొన్నారు. జిల్లా నోడల్ అధికారి కాంతారావు, మండల వ్యవసాధికారి పైడితల్లి మాట్లాడుతూ ప్రకృ తి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు.
సమా జంపై అవగాహన లేక గ్రామాల్లో బాల్యంలోనే వివా హాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన అన్నారు.
లోక్ అదాలత్లతో సత్వర న్యాయం సాధ్యమని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సదస్సును గోదావరిఖని సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం న్యాయస్థానం ఆవరణలో సమీక్ష నిర్వహించారు.
సింగ రేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్క రించాలని లేకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీనులు పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీ-5 లలో ధర్నాలు నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజే శారు.
ఆరు గ్యారంటీలు అమలులో కాం గ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వాటిని వెంటనే అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు బీజేపి నాయుకులు వినతిపత్రం అందజే శారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులకు సోమవారం పీఎంశ్రీ జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలు విజయవంతంగా జరిగాయి. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు పెంచేందుకు ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఫర్ ఇండియా లక్ష్యమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్ అన్నారు.