Home » Peddapalli
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఆదివారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్జీ-1 ఏరియా జీడీకే 1ఇంక్లైన్ ఉద్యోగులు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నిరంతరం స్థానికంగా ఉంటూ నిజా యితీగా సేవలు అందిస్తున్నాన్నని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలి పారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో ఎంతో అభివృధ్ధి చేసినట్లు తెలిపారు.
గోదా వరిఖని సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ ఏడాది రూ.57.74లక్షల ఆదాయ సమకూ రింది. ఆదివారం సారలమ్మ దేవాలయం హాల్లో హుండీల లెక్కించారు. 44హుండీల ద్వారా రూ.31,26,324 ఆదాయం సమకూ రింది. గతేడాది రూ.29,44,489 ఆదాయం సమకూరగా ఈసారి రూ.1,81,835 అదనపు ఆదాయం సమకూరింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం కక్ష సాధింపేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం నుంచి గోదావరిఖని చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేప ట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన ఆశావహులందరిలో అయోమయం నెలకొన్నది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన వారు నిశ్చింతగా తమ తమ డివిజన్లు, వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు.
కేంద్ర బడ్జెట్ ఏలా ఉండబోతుంది.. ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది.. చివరికి ఎవరిపై ప్రభావం చూపబోతుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై ప్రభావం ఉంటుంది.
మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో రసవత్తరంగా మారాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు బీ ఫారాలను అంద జేయక పోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయా పార్టీల నుంచి ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేసిన వారికి బీ ఫారాలు వస్తాయనే భరోసాతో ఉన్నారు.
విద్యార్థి దశలోనే క్రీడలు కీల కమని, ప్రతీ విద్యార్థి క్రీడల్లో రాణించాలని ఎంపీడీవో సుమలత అన్నారు. శనివారం నందిమేడారం బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ ఆటల పోటీలను ఎంఈఓ ప్రభాకర్, ఎస్ఐ ప్రవీణ్కుమార్తో కలిసి ప్రారంభించారు.
రామ గుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో హస్తం అభ్యర్థులకు ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ లేని వాతావరణం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఆధ్వర్యంలో డివిజన్లలో ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీదారులు, ప్రభావితం చేసే నాయకులే లక్ష్యంగా ఆపరేషన్ సాగుతుంది.
నగరపాలక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్లలో ఓసీలకు తీరని అన్యా యం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామా రావు ఆరోపించారు. శనివారం కాసులపల్లిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి మహా ధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించారు.