Home » Peddapalli
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) వెలుగులను పంచుతూ దేశంలోనే సహకార రంగంలో అగ్రగామిగా నిలిచింది. మరోవైపు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా సెస్ సంస్థకు బకాయిలు గుదిబండగా మారాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులో కాస్త ఆలస్యమైతేనే వినియోగదారులపై అపరాధ రుసుం విధిస్తారు.
రాష్ట్రంలోని పేద, నిరుపేద వర్గాలకు భద్రత, భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వచ్చే జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకవస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఈ పథకం ద్వారా 2.48 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తించ నున్నది.
గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శనివారం వైద్యులు ఆపరే షన్ చేసి మహిళ కడుపులోంచి కణితి తొలగించారు. ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 1ఇంక్లైన్ బొగ్గుగనిలో పని చేసే తిరుపతి అనే ఉద్యోగి భార్య సుమలత ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల క్రితం సింగరేణి ఏరియా ఆసుప త్రిలో చేరింది.
కొల నూర్ సమ్మక్క, సారలమ్మ బీటీ రోడ్డు మూ ణ్నాళ్ళ ముచ్చటగా మారుతోంది. సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సౌకర్య వంతంగా ఉండేందుకు కొలనూర్ ఆర్అండ్బి రోడ్డు నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు రూ.95 లక్షలు వెచ్చించి బీటీ రోడ్డును నిర్మించారు.
జిల్లాలోని గొర్రెకాపరుల హక్కులు, ఆత్మగౌరవం, మార్కెట్ స్థలాల రక్షణ కోసం ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట గొంగడి ధర్నా నిర్వహించనున్నట్లు గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం నాయకులు ప్రకటించారు.
రామగుండం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.248.66కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించింది. 2027 మార్చి నాటికి రూ.28.08కోట్లు మిగిలి ఉంటుందని అంచనా వేసింది. గత సంవత్సరం రూ.246.47కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదించగా ఈ ఏడాది రూ.2కోట్లు పెంచి రూ.248.66కోట్లకు అంచనా వేశారు.
ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా ప్రభావిత ప్రాంతాల మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. టీటీఎస్లోని ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వ హించిన కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, మెటీరి యల్ను పంపిణీ చేశారు.
పదవితో ప్రజలకు మరింత సేవ చేస్తానని, తాను ఆశించి తెచ్చుకోలేదని ప్రభుత్వ విప్ చిం తకుంట విజయరమణారావు తెలిపారు. విప్ పదవి అనంతరం పెద్దపల్లికి వచ్చిన విజయర మణారావును దుబ్బపల్లి నుంచి పెద్దపల్లి జెండా చౌరస్తా వరకు ర్యాలీగా తీసుకువచ్చారు.
నేలవాలిన పంటలకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని కూనారం, వెన్నంపల్లి, మంగపేట, జాఫర్ఖాన్పేట గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన వల్ల నష్టపోయిన మొక్కజొన్న క్షేత్రాలను సందర్శించారు.
అభివృద్ధి పనులను సకాలంలో గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలి పారు. శుక్రవారం కలెక్టర్ రామగిరి మండలం, మంథని పట్టణ పరిఽధిలో విస్తృతంగా పర్యటిం చారు. రామగిరి మండలంలోని కేజీబీవీ విద్యాల యం, తహసీల్దార్ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేజీబీవీలో ఏర్పాటు చేసిన మాడ్యులర్ కిచెన్ను ప్రారంభించారు.