Home » Peddapalli
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియామవళిని కచ్చితంగా పాటించాలని రామగుండం నగర పాల క కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. బుధవారం కార్పొరేషన్ బరిలో నిలిచిన అభ్యర్థులతో ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయకళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు.
పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు.. యువతకు ఉపాధి కల్పించలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. దుర్మార్గ పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీఽధర్ బాబు అన్నారు.
ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారిని పారదోలాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగు లకు పండ్లు పంపిణీ చేశారు.
అంగ న్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నడిపిం చాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కవిత అన్నారు. మంగళవారం నర్సాపూర్లోని మూడు కేంద్రాలను పరిశీలించారు.
మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పద్మజరాణి అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను మంగళవారం పరిశీలించారు.
కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (79) మంగళవారం హైదరాబాద్లో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ హైదారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపతిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
సుల్తానా బాద్ మండలం నీరుకుళ్ల సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఈ సారి 21 లక్షల 988 రూపాయల ఆదాయం సమకూ రింది.
క్రీడల్లో గెలు పోటములు సహజమని ఎంపీడీవో శైలజారాణి, ఎస్ఐ శ్రీనివాస్లు అన్నారు. సోమవారం జెఎన్టీయు కళాశా లలో సీఎం కప్ మండల స్థాయి బహుమతి ప్రధానోత్స వంలో మాట్లాడారు. విద్యార్థులు క్రీడలను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.
పంచాయతీ కార్యదర్శులు ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తున్నా రని ఫిర్యాదులు వస్తున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులను నడప డంతో ఇతర రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు బస్సులు లేకపోవడంతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్ప డింది. సోమవారం ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.