Home » Peddapalli
కరీంనగర్లో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఉద్యమకారులతో రౌండ్టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లవారి నుంచే తెలంగాణ భావజాలంపై దాడి ప్రారంభమైందని విమర్శించారు.
చేనేత సహకార సంఘాలకు సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 11 చేనేత, పవర్లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనుండడంతో సొసైటీ సభ్యుల్లో సందడి నెలకొంది. జిల్లాలో ఎన్నికల పోరు ఏకగ్రీవంగానే
వన మహోత్సవానికి వేళయింది. వర్షాకాలం ఆరంభం అయ్యిందంటే మొక్కలు నాటేందుకు అనువుగా ఉంటుం దని భావిస్తున్న ప్రభుత్వం యేటా జూన్, జూలై మాసాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 27 లక్షల 58 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్న పరిస్థితిని సామాన్య ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్య జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
రైతులకు నాణ్య మైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేసి వినతిప త్రం అందించారు.
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి వైద్యులకు సూచించారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక భర్త రాజును గురువారం పరామర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుతోపాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సింగరేణి కార్మికుల ఆశీ స్సుల కోసం వచ్చానని, సామాజిక తెలంగాణ లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేనకు సింగరేణి కార్మికుల మద్దతుగా నిలుస్తారని ఆశిస్తు న్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు.
జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కొప్పుల వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కల్యాణ మండపంలో బూత్ స్థాయి అధికారులకు, సూపర్వైజర్లకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సింగరేణి యాజమాన్యంపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖనిలో నిరసన ప్రదర్శనకు దిగారు. ర్యాలీలో రామగుండం-1, 2, 3, భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లకు చెందిన వెయ్యి మంది అధికారులు పాల్గొన్నారు.