Home » Peddapalli
దేశ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో జనగణన - 2027 అత్యంత కీలకమైనది. ఇందులో భాగంగా పారదర్శకంగా, ఖచ్చితమైన వివరాలు నమోదు చేసుకునే వీలు కల్పిస్తూ ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ స్వీయ గణనకు అవకాశం కల్పించింది. ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల ఉద్యోగులు, విద్యావంతులు గణనపై అవగాహన కల్పించడంతో పాటు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించారు.
ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా వివిధ వ్యాపారాలపై తీరని భారం పడుతున్నది. కమర్షియల్ వంట గ్యాస్ ధర ఐదు నెలల్లో ఐదుసార్లు పెరగడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ పేదలను పట్టించుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం అడవిశ్రీరాంపూర్లో మంత్రి పర్య టించారు. గ్రామంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవే శంలో పాల్గొన్నారు.
సుల్తానాబాద్ ప్రాంతంలోని రైస్ మిల్లుల్లో శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిల్లర్లు ధాన్యం అన్లోడింగ్ను వేగవంతం చేసేలా వారితో కలెక్టర్ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు ఏర్పా ట్లు చేసుకోవాలని హెచ్చరించారు.
మతపరమైన ఆంక్షలు తొలగించి ఎస్సీలకు సంపూర్ణ మత స్వేచ్ఛ కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతానియేల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని బేతేలు చర్చిలో దళిత కైస్త్రవులు హక్కుల సాధనకు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి నియో జకవర్గం అభివృద్ధిలో తీవ్ర నిరక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మం త్రుల సహకారంతో రెండేళ్లలో కోట్లాది రూపాయలతో దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
మహిళల రక్షణ, భద్రత షీటీం ప్రధాన ధ్యేయమని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ భరోసా కేంద్రాల సిబ్బందితో సమీక్ష సమావే శాన్ని నిర్వహించారు.
ధాన్యం కొను గోలు కేంద్రాల నుంచి ఆయా రైస్మిల్లులకు వస్తున్న లారీలలోని ధాన్యాన్ని దిగుమతి చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని, వెంటనే ట్రక్ షీట్లను జనరేట్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రైస్మిల్లర్లను ఆదేశిం చారు.
బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్లాటర్ హౌస్ నిర్వాహకులతో సీపీ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లు, లిఫ్టింగ్, ట్యాబ్ ఎంట్రీలు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.