• Home » Peddapalli

Peddapalli

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీ

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీ

ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌ కొంత కాలంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల విమర్శ, ప్రతి విమర్శలకు వేదికైంది. గోదావరిలో నీళ్లు వృథాగా పోతున్నా కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశ్యంతోనే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయడం లేదని మాజీ మంతి కొప్పుల ఈశ్వర్‌ గత నెల 20న, మేడారంలోని నంది రిజర్వాయర్‌లో తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్రికెట్‌ ఆడి నిరసన తెలిపారు.

ప్రజావాణి అర్జీలపై వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలపై వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణికి వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యంతో పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు.

యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించి బొక్కలవాగు సందరీకరణ పనులను ప్రారంభించారు.

ఎన్టీపీసీలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు

ఎన్టీపీసీలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు

పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ జిల్లా పరిషత్‌ పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

చదువుతోనే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు

చదువుతోనే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు

చదువుతో ఉన్నత శిఖరా లలో ఉంటారని తహసీల్దార్‌ రాపెల్లి రాముడు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన మెటీరియల్‌ కార్పెట్‌, బెడ్‌షీట్లు, నోటుబుక్కులు, ప్లేట్లు, గ్లాసులు అందించారు.

సింగరేణి రక్షణకు ప్రత్యక్ష పోరాటం

సింగరేణి రక్షణకు ప్రత్యక్ష పోరాటం

తెలంగాణ కొంగు బంగారంగా పేరుగాంచిన సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నదని ఆ సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ కాజిపల్లిలోని శ్రీమయి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన టీజీబీకేఎస్‌ కేంద్ర కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు.

కాళేశ్వరంపై ప్రభుత్వానివి అవగాహన లేని మాటలు

కాళేశ్వరంపై ప్రభుత్వానివి అవగాహన లేని మాటలు

కాళే శ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకు కనీస అవగాహ న లేదని, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రుల బృందం విమర్శించింది. ఆదివారం నందిమేడారం నంది పంప్‌హౌస్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు సందర్శిం చారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కొప్పుల ఈశ్వర్‌, బోయినిపల్లి వినోద్‌కుమార్‌, ఎల్‌.ర మణ మీడియాతో మాట్లాడారు.

సమస్యలపై పోరుబాట..

సమస్యలపై పోరుబాట..

గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలస వెళ్తున్న కూలీలకు స్థానికంగా ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఏర్పడ్డ మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఎస్‌ఆర్‌ఈజీఎస్‌ స్థానంలో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అజీవిక మిషన్‌ - గ్రామీణ(వీబీ జీరామ్‌జీ)గా మార్చింది.

కొత్త పింఛన్లపై ఆశలు..

కొత్త పింఛన్లపై ఆశలు..

కొత్త పింఛన్లు ఈనెల 15వ తేదీ నుంచి మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరి సారిగా 2022 అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లో కొత్త పింఛన్లు మంజూరు చేశారు.

వీర్లపల్లి ప్రజలకు త్వరలో నివేశన స్థలాలు

వీర్లపల్లి ప్రజలకు త్వరలో నివేశన స్థలాలు

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రభావిత గ్రామమైన వీర్లపల్లి వాసులకు త్వరలోనే నివేశన స్థలాలు అందించి ఇండ్లు నిర్మించేందుకు ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి