Home » Peddapalli
ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న దంత వైద్య సేవలను అవసరమైన ప్రజలు విని యోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. దంత సమస్యలతో కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న కలెక్టర్ గురువారం జిల్లా ఆసుపత్రిలో రూట్కెనాల్ చేయించుకున్నారు.
సింగరేణి సంస్థను అమ్మ డానికి కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు కుట్రలు పన్ను తున్నారని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్ అహ్మద్, ఐ కృష్ణ ఆరోపించారు.
రామగుండం కార్పొరేషన్లో నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. గురువారం తెల్లవారుజామున బైక్పై పలు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.
రెండేళ్లకో సారి వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర సందడి కోల్ బెల్ట్లో నెల రోజుల ముందు నుంచే మొదలైంది. జనవరి 27, 28, 29తేదీల్లో సమ్మక్క జాతర జరగనుంది. కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రతీ ఇంటిలో వన దేవతలను కొల వడం ఆనవాయితీ.రెండు రోజుల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క-సాలరమ్మ మొక్కులు మొదలయ్యాయి.
గోదావరినది దాటి రామగుండం వైపు వచ్చిన పెద్దపులి ఎట్టకేలకు వారం రోజుల తరువాత తిరిగి గోదావరిదాటింది. సోమవారం రాత్రి గోదావరినది దాటి మంచిర్యాల జిల్లా రామారావుపేట ఓపెన్కాస్టు వైపు వెళ్టినట్టు ఫారెస్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరినదిలో పులి పాదముద్రలను గుర్తించారు.
గ్రామాలాభివృద్ధికి పంచాయతీల పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులను శ్రీశివకిరణ్ గార్డె న్స్లో మంగళవారం సన్మానించారు.
సుల్తా నాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకు ఆరు కోట్ట రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.
జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారు లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహిం చారు.
గోదావరిఖనిలో కూల్చి వేతలను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును జిరాంజీ ఉపాధి పథకంగా పేరు మార్చడం దుర్మార్గమని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. ఇం దుకు నిరసనగా సోమవారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చట్టం ప్రతులను దహనం చేశారు.