Home » Peddapalli
ఏడాదంతా ‘స్థానిక’ ఎన్నికల ఆశలతోనే రాజకీయ నేతలు ఎదురుచూడాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జనవరి 25న సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. అంతకుముందు ఏడాదిలోనే పంచాయతీ, పరిషత్ పాలకవర్గాల కాలం ముగిసింది.
రామగుండం పోలీస్ కమిషరేట్లో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది. ఇదే సమయంలో చోరీలు, సైబర్ క్రైమ్ల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును పోలీసులు రీకవరీ చేయడంలో పురోగతి సాధించారు. గతేడాది 33శాతం రికవరీ ఉంటే ఈ ఏడాది రికవరీ చేశాతం 55కు పెరిగింది.
రామగుండంలో అభివృద్ధి చేస్తుంటే కొందరు నాయకులు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని, ఇది సరైంది కాదని శివాజీనగర్ బట్టల వ్యాపార సంఘం అధ్యక్షుడు సదయ్య అన్నారు. శనివారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో వస్త్ర వ్యాపారులు, ప్లవర్ మర్చంట్, బుక్క దుకాణాదారులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌరస్తా నుంచి లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్ మీదుగా మౌన ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతుందని, మల్లేష్ ఏడు రోజులుగా చౌరస్తాలో నిరసన దీక్ష చేస్తున్నా అధికారులు, పాలకులు న్యాయం చేయడం లేదని ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పేర్కొన్నారు. ఆర్.కే గార్డెన్స్లో శనివారం 245 మంది లబ్ధిదారులకు కోటి 7 లక్షల 57 వేల 756 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన, సమర్థవంతమైన పోలీసింగ్తో ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం పోలీస్ కమిషరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు.
రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్క రరావు భవన్, ఖని చౌరస్తాలో శుక్రవారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్లు పతకాల ను ఆవిష్కరించారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సం ఘాలు పూర్తిగా విఫలమైనట్టు టీబీజీకేఎస్ అధ్య క్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వీకేపీ గనిలో జరిగిన గేట్మీటింగ్లో మాట్లా డారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీ యూసీ 47, ఐఎన్టీయూసీ 39 హామీలను మెనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని వాగ్దానాలు చేసినట్టు తెలిపారు.
రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో కూల్చివేతలు ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయపక్షాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హు స్సేన్, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.