Home » Peddapalli
జిల్లా ఆస్పత్రిలో 24 గంటలు మెరుగైన వైద్యసే వలు అందుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రిని సందర్శించి నూతనంగా నిర్మిస్తు న్న ఆస్పత్రి భవన పనులను పరిశీలించిన అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలి సారిగా రోజు ఒక్కో రకం రంగు బెడ్ షీట్ లను వినియోగించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రా రంభిస్తున్నట్టు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకాన్ని నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్ స్పష్టం చేశారు. శివకిరణ్ గార్డెన్స్లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపికలో భాగంగా నిర్వహించిన సంఘటన్ శ్రీజాన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని మంథని, రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరితో సమాలోచనలు చేసిన అనంతరం సమర్థవంతమైన నాయకుడిని అందరి ఆమోదం మేరకు ఎంపిక చేస్తామని వెల్లడించారు.
జాప్యం లేకుండా కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సేవలను ఉద్యోగులకు అందించేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ హరి పచౌరి అన్నారు. మంగళవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను ఆర్జీ-3 జీఎం సుధాకర్రావుకు అందజేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం పెరిగిందని, చిన్న స్థాయి కాంగ్రెస్ నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు పోలీసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు పేర్కొన్నారు.
వివిధ వ్యాధులతో చికిత్స కోసం వచ్చే పేషంట్ల ద్వారా కొన్ని వ్యాధులు వైద్య ఆరోగ్య సిబ్బందికి సంక్రమించే ప్రమాదం ఉందని, ఇందుకు సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు.
మంథని నియోజకవర్గాన్ని సరస్వతీ నిలయంగా మార్చడానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో డివిజన్లోని మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాలకు చెందిన 87 సీఎంఆర్ఎఫ్, 38 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు సోమవారం మంత్రి పంపిణీ చేశారు.
వైన్ షాపు టెండర్లకు నోటిఫికేషన్ విడుదలై 15 రోజులు దాటినా అరకొరగానే దరఖాస్తులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. దీంతో 2025-2027 సంవత్సరానికి గాను కొత్త లైసెన్సుల జారీకి ప్రభుత్వం గత నెల 25న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మరుసటి రోజు నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలో 74 మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు.
ప్రజా వాణి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా డిప్యూటి టైనీ కలెక్టర్ బనావత్ వనజ తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, పాఠశాల అభివృద్ధి పనులకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తీర్మానాల ప్రకారం పూర్తి చేయాలన్నారు.
హిందు సమాజాన్ని ఐక్యత చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కృషి చేస్తుందని కరీంనగర్ విభాగ్ సద్బావన్ ప్రముఖ్ కొండేటి బాలరాజు, సహ కార్యవాక్ కొంపెల్లి రాజన్న అన్నారు. ఆదివారం గోదావరిఖనిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పథ సంచాలన కార్యక్రమం సందర్భంగా సమరోక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.