Home » Peddapalli
కూనా రం ఆర్వోబీ నిర్మాణాన్ని జూలైలోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్అండ్బి అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ఆర్అండ్బి అతిథిగృహం ప్రహరి పనులను పరిశీలిం చారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యత్రాంగం సన్నద్ధమవు తోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరే షన్లలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని ఈ నెల 27న మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది.
ప్రజావాణి అర్జీలను సత్వ రమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీక రించారు.
గ్రామాలలో కొత్త నర్సరీ ఏర్పాటు, ప్రస్తుత నర్సరీల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని దేవి అన్నారు. సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.
జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల అవార్డును ప్రదానం చేసినట్లు కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లాస్థాయి అవార్డులు, ప్రశంసాపత్రాలను ఆయన అందించారు.
బీసీ సంక్షేమ సంఘం పటిష్టత, బలోపేతమే లక్ష్యంగా ప్రతీ బీసీ నాయకుడు కృషి చేయాలని తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల సదాశివ్ కోరారు. ఆది వారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు.
రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్పష్టం చేశారు. ఆదివారం శివపల్లిలోని ఆయన స్వగృహంలో టీఆర్టీఎఫ్ జిల్లా శాఖ క్యాలండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు.
జానపద కళలను భావితరాలకు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని నందనగార్డెన్ ఆవరణలో ఆ సంఘం జిల్లా కళాకారుల సమావేశం నిర్వహించారు.
జాతీయ ఉపాధిహామీ పథ కం పేరు మారుస్తూ ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివా రం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఉదయ్రాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలో 2025 సంవత్సరంలో రాజకీయం రసవత్తరంగా సాగింది. ప్రస్తుత సంవత్సరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరిచింది. పంచాయతీ ఎన్నికలు జరగడం, వచ్చే యేడాది జరగనున్న మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలను టార్గెట్గా పెట్టుకోవడం తదితర కారణాల వల్ల ప్రధాన పార్టీల నేతలు జనం మధ్య తిరిగారు.