Home » Peddapalli
పండగల సందర్భంలో చర్లపల్లి-దనపూర్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబరు23, 28తేదీల్లో చర్లపల్లి- దనపూర్(07049)రైళ్లు, 24,29 తేదీల్లో దనపూర్-చర్లపల్లి (07092) రైళ్లు, 26న చర్లపల్లి- దనపూర్ (07049), 27న దనపూర్-చర్లపల్లి (07050)ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు వివరించారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని, ప్రజలకు సేవలందించడానికి, శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పోలీస్శాఖ ముందుకు వెళుతుందని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయం చుట్టు రూ.28.64 లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఉమ్మడి జిల్లాలోని యాద వులకు ఈనెల 24న ఒక రోజు రాజకీయ శిక్షణ శిబిరం నిర్వ హిస్తున్నట్లు యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ తెలి పారు. మండల కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ మం డల ఉపాధ్యక్షుడు జిల్లా కనుకన్న అధ్యక్షతన జరిగిన సమావేశం అనం తరం విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో దీపావళి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలను సోమ, మంగళవారాల్లో ఘనంగా జరుపుకున్నారు. దీపావళిని పురస్కరించుకొని ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు ఇండ్లలో, షాపుల్లో ధన లక్ష్మీ పూజలను నిర్వహించారు.
రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్ర ప్రభు త్వం చేస్తున్న ద్వంద విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని సెంటినరీకాలనీలో సిఐటియు(సిపిఐ) ఆధ్వర్యంలో నల్లజెండాల తో నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని తీర్మానం ప్రవేశపెట్టి గవర్నర్కు పంపినా ఆమోదం తెలుపలేదన్నారు.
రామగుం డం నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలు చేసినా అభి వృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ వద్ద చిరు వ్యాపారుల కోసం నిర్మించిన వాణిజ్య, వ్యాపార సంస్థలను ఆయన ప్రారంభించారు.
రామగుండం ప్రజల కల త్వరలోనే నెరవేరబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సింగరేణి ఆధ్వ ర్యంలో జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన దసరా, దీపావళి-2025 ఉత్సవాలను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూ ర్తో కలిసి ప్రారంభించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శని వారం బంద్ విజయవంతమైంది. పెట్రోల్ బంక్లు, సినిమా థియేటర్లు, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుచు కోలే దు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణ ప్రాంగణాలు వెలవెలబో యాయి. రాజకీయాలకు అతీతంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీసీ, కుల సంఘాల నాయకులు బంద్లో పాల్గొన్నారు.
మద్యం షాపుల టెండర్లకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. 2023లో వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఇందుకు రెండు లక్షల రూపాయలు ఉన్న దరఖాస్తు ఫారాన్ని మూడు లక్షలకు పెంచడం వల్లనే వ్యాపారులు ఆసక్తి చూపలేదని తెలుస్తుంది.