Home » Peddapalli
ఆర్జీ-1లో డిసెం బరులో 4.47లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికిగాను 3.62లక్షల టన్నుల ఉత్పత్తితో 90శాతం సాధించిందని జీఎం లలిత్ కుమార్ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 33.2లక్షల టన్నులకుగాను 29.62లక్షల టన్నులను సాధించిందని, రూ.3లక్షల టన్నులు వెనుకబడిందన్నారు.
సుల్తానాబాద్ పట్టణంలోని పలు బ్యాంకుల నిర్వాహకులు పటిష్టమైన భద్రత, రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ బ్యాంకు అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రధాన బ్యాంకులను పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేశారు.
వానాకాలం, కాలువల ద్వారా నీరు విడుదల అయినప్పుడు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కెనాల్పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని శుక్రవారం రైతులు నీళ్లలో నిలబడి నిరసన తెలిపారు. మండలంలోని సబ్బితం గ్రామ పరిధిలోని డి-83 కెనాల్ గుండా సాగు నీరు విడుదల చేశారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గౌడ కులస్థులకు ఉపాధి కల్పించేలా సింగరేణి భూములను కేటాయించా లని కాలనీ గౌడ సంక్షేమ సంఘం నాయకులు డిమాం డ్ చేశారు.
గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది గోషిక ప్రకాష్ మంగళవారం గుండెపోటుతో మరణించాడు. ప్రకాష్ మృతదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దోహదపడే విధంగా అనాటమీ విభాగానికి అప్పగించి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు.
మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కుటుంబ సభ్యులపై మరోసారి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహిం చేది లేదని పలువురు కాంగ్రెస్ నేతలు వెల్లడిం చారు.
వైద్యులు సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా నిర్వహిచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు సూచించారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ క్రిటికల్ కేర్, సర్జరీ బ్లాక్లు, ఆర్థోపెడిక్, జనరల్ వార్డులను పరిశీలించారు.
ఇటీవల బస్సు ప్రమాదంలో గాయపడిన ఇంటర్మీడియట్ విద్యార్థిని పడాల మేఘనకు గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల చేయూతనిచ్చింది. తోటి విద్యార్థినులు, అధ్యాపకులు విరాళంగా సేకరించిన రూ. 50వేలను నగదును మంగళవారం కళాశాల ఆవరణలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి, ప్రిన్సిపల్ డి.కల్పన చేతులమీదుగా విద్యార్థినీ తల్లిదండ్రులకు అందజేశారు.
రామగుండం నగరపాలక సంస్థలో 2 నుంచి 11వరకు శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ చెప్పారు. మంగళవారం అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్బాబు నియోజకవర్గ ప్రజలకు, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మాజీ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు తనను వ్యక్తిగతంగా దూషించేలా మంత్రితోపాటు ఆయన సోదరుడు వారిని ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ధ్వజమెత్తారు.