Home » Peddapalli
సింగరేణిలో రక్షణపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, కార్మికుల సమస్యలు పరిష్క రించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ విఫలమ య్యాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యత తీసుకొని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. పెద్దాపూర్ అనుబంద గ్రామమైన కుర్మపల్లికి మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో పరిశుభ్రత పాటిస్తూ పన్నులు కూడా వసూళ్లు చేయాలని జిల్లా పంచాయతీ అధి కారి వీరబుచ్చయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లతో సమావే శం నిర్వహించారు.
సింగరేణి కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సమావేశం గోదావరిఖనిలో జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది.
పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
రైతులు ఎదురు చూస్తున్న యాసంగి సన్నరకం ధాన్యానికి బోనస్ డబ్బు లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే విజయరమ ణారావు అన్నారు. గురువారం పొత్క పల్లిలో మార్క్ఫెడ్ కేంద్రంతోపాటు ధాన్యం కొను గోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అద నపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రారం భిం చారు.
జిల్లాలో మద్యం షాపులకు టెండర్ల దాఖలు గడువు గురువారం నాటితో ముగిసింది. మొత్తం 74 మద్యం షాపులకుగాను 1471 దరఖాస్తులు వచ్చాయి. వీటి రూపేణా ప్రభుత్వానికి 44 కోట్ల 13 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు బంధంపల్లిలోని స్వరూప గార్డెన్లో డ్రా పద్ధతిన లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా, చేయమని అడిగినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వాణిశ్రీ హెచ్చరించారు. గురువారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని రేడియాలజీ, గైనిక్ విభాగంలో స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను ప్రిన్సిపాల్ విధుల నుంచి తప్పిస్తూ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ 500విడుదల అయ్యింది. హిమబిందు స్థానంలో అదే కళాశాలలో బయో కెమిస్ర్టి ప్రొఫెసర్ నరేందర్ను ఇన్చార్జి ప్రిన్సిపాల్గా నియమించారు.