• Home » Peddapalli

Peddapalli

రైతులను ప్రత్యామ్నాయ   పంటల సాగుకు ప్రోత్సహించాలి

రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలి

సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, యూరియా యాప్‌ రాష్ట్రానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

ఒక్కో విద్యార్థి - ఒక మొక్క నాటాలి

ఒక్కో విద్యార్థి - ఒక మొక్క నాటాలి

ఒక్కో విద్యార్థి - ఒక్క మొక్క అనే నినాదాన్ని ఆచరణలో పెట్టాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని సెక్రడ్‌ హార్ట్‌ హైస్కూల్‌లో ఏకో క్లబ్‌ను మేయర్‌ ప్రారంభిం చారు.

విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటం

విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటం

విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్‌ఎస్‌ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద జీవో 17ను రద్దు చేయాలంటూ రాజీవ్‌ రహదారిపై ధర్నా చేపట్టారు.

అభివృద్ధి పనులను   నెలాఖరులోగా పూర్తిచేయాలి

అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలి

మండలంలోని అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పలు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్‌ పర్యటించారు. ఓదెలలో కలెక్టర్‌ మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న ఐకేపి భవనంలో సివిల్‌ కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా, వినియోగించుకునే విధంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అర్హుల పేర్లు ఉండేలా కృషి చేయాలి

అర్హుల పేర్లు ఉండేలా కృషి చేయాలి

రామగుండం నియోజక వర్గంలో ఓటరు జాబితాలో ప్రతీ అర్హుడి పేరు నమోదయ్యేలా కాంగ్రెస్‌ శ్రేణులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ సర్‌, బీఎల్‌ఏ ఇన్‌చార్జిలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అక్రమ అరెస్ట్‌ చేస్తే భయపడేది లేదని టీఆర్‌ఎస్‌ జిల్లా ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య అన్నారు. హైదరాబాదులోని ఉప్పల్‌ బగాయత్‌ ప్రాంతంలో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన గురువారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి పంపిణీ చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు హైదరా బాదుకు తరలి వెళ్లే క్రమంలో రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు

ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు

మేడిపల్లి ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం మేడిపల్లి ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్‌ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను పరిశీలించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ గురువారం ఎన్టీపీసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, కాంట్రా క్టర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

అధికారులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

అధికారులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేయటం కాంగ్రెస్‌ పాలనకు నిదర్శనమని, ప్రజాపాలనకు సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ తీవ్రంగా విమర్శించారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తితో కలిసి గురువారం సాయంత్రం గోదావరిఖని జీఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఈ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పాలక మండల సమావేశం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి