Home » Peddapalli
మున్సిపల్ ఎన్నికల రిజ ర్వేషన్లపై తర్జనభర్జన జరుగుతోంది. మున్సిపల్ చట్టం-2019 ప్రకారం మున్సిపాలిటీల్లో వరుసగా రెండు సార్లు ఒకే రిజ ర్వేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ రిజర్వేషన్ అయితే వార్డులు, చైర్మన్ పదవులు ఉన్నాయో, అదే విధంగా ఈసారి కూడా రిజర్వేషన్ కావాల్సి ఉంటుంది.
ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమా ణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం చందనాపూర్ జడ్పిహెచ్ఎస్, రత్నాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు.
యాసంగిలో సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా యాసంగిలోనూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోంది. కాలువ చివరలో ఉన్న కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ పరిధిలోని పొలాలకు అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలోనే జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్లు ఇంకా ఖరారుకాక పోవడంతో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు సిలబస్ పూర్తి చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనలో వేగం పెంచారు. ఉదయం, సాయంత్రం గంట పాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు.
పురపోరు సమయం సమీపిస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులపై గల్లీ, గల్లీలో చర్చ మొదలైంది. మద్దతుదారుల సమీకరణలతో ఆశా వహులు హడావుడి చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థినులు తరలివచ్చి రంగు రంగుల రంగవల్లిక లతో సంక్రాంతి పండుగను తలపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. సోమవారం అడ్దగుంటపల్లిలోని ఒక ఫంక్షన్హాల్లో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఓటరు జాబితా ముసాయిదా పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాలను ఈనెల 9వ తేదీ వరకు అధికారులు స్వీకరించనున్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు.