Home » Peddapalli
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికుల పక్షమా లేక యాజమాన్య పక్షమా అని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి ప్రశ్నించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ అయిలి శ్రీనివాస్తో కలసి మాట్లాడారు.
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ పిలుపునిచ్చారు.
మహిళలపై హింస, లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి అన్నారు. హింసకు వ్యతిరే కంగా మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీపీసీ ఐఎఫ్టీయూ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సం ఘం పీఓడబ్ల్యు జనరల్ బాడీ సమావేశం జరిగింది.
పోలీస్స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ఆదివారం పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇదీ.. అదీ అని లేదు.. అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి మొదలుకుని కోడిగుడ్డు వరకు అన్నింటికి రెక్కలు వచ్చాయి. తాజాగా కోడిగుడ్డు ధర ఎనిమిది రూపాయల వరకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నారు. మరోవైపు ఇసుక ధర ట్రాక్టర్కు ఏడు వేల రూపాయలకు చేరింది. దీంతో ఇళ్లు నిర్మించుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగి నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక ధర పెరగడంతో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉక్కిరిబిక్కరవుతున్నారు.
అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ప్రభుత్వం దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇచ్చింది. జూలై31 వరకు 25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో ఎల్ఆర్ఎస్కు నామమాత్రంగానే స్పందన కనిపిస్తోంది.
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలకవర్గ కమిటీలను నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు మొదలుపెట్టారు. నామినేటెడ్ విధానంలో నియమించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆయా పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
రామగుండం గురుకుల పాఠశాల పక్కన గల 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ అన్నారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
సమష్టి కృషితో ఆరు నెలల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పు తీసుక వచ్చేలా ప్రతీ ఒక్క అధికారి పని చేయాలని, వాటి సాధన దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం వివిధ అంశాలపై ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. శనివారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కు లను పంపిణీ చేశారు.