Home » Peddapalli
ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఓదెల మం డలం జీలకుంట గ్రామానికి చెందిన దార సతీష్ అదనపు కలెక్టర్ డి వేణుకు విజ్ఞప్తి చేశారు. ఆయన తహసీల్దార్ను విచార ణకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లాలో గల మద్యం షాపులకు లైసెన్స్దారులను ఎంపిక చేసేందుకు సోమవారం డ్రా తీయనున్నారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బంధంపల్లిలో గల స్వరూప గార్డెన్లో ఉదయం 11 గంటలకు డ్రా తీయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 9వ తేదీలోగా పీఆర్సీ ప్రకటించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎంబి గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు.
పత్తి రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం రాఘవ పూర్ శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అసత్య ఆరోపణలు చేయడాన్ని సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోవడం లేదన్నారు.
ఖరీఫ్ సాగులో ఎరువుల కొరతతో అష్టకష్టాలు పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు యాసంగి సీజన్పై ఆందోళన మొదలైంది. వ్యవసాయంలో పెట్టుబడుల భారం రోజురోజుకు పెరుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు యాసంగి ఆరంభంలోనే పెరుగుతున్న ఎరువుల ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధమైంది. పత్తి విక్రయాలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కపాస్ కిసాన్’ యాప్ను తీసుకవ చ్చింది. ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుకింగ్ చేస్తేనే ఎంపిక చేసుకున్న సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాల్సి ఉంటుంది.
సింగరేణిని రక్షించుకోవడా నికి ఐక్య పోరాటాలు నిర్మిద్దామని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శనివారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో సింగరేణి విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదంరాంతోపాటు పలు వురు నాయకులు మాట్లాడారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమని డీసీపీ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారో త్సవాల భాగంగా సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని వారం ఎన్ఎస్ఎస్ వార్షికోత్స వాన్ని ఘనంగా నిర్వహిం చారు. శాతవాహన విశ్వ విద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై వలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు.