Home » Peddapalli
యుఐడిఎఫ్ నిధులు రూ.88.60కోట్లతో నగరంలో నీటి సరఫరా మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుం టున్నట్లు రామగుండం మేయర్ మహాంకాళి స్వామి తెలిపారు. శనివారం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్తో ఆయన సమీక్షించారు.
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను పరస్పర సహకారంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు.
సింగ రేణి స్థలాలలో అక్రమంగా మసీదు, చర్చిలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శని వారం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికా రులను ఆదేశించారు. శనివారం ఐడిఓసీ కార్యాలయం లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్య లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అండ్ కెమిస్ట్ అసోసి యేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో మెడికల్ షాపులను బంద్ విజయవం తమైంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, రాముగుం డం, గోదావరిఖని, మంథని, అన్ని మండ లాల్లో మందుల దుకాణాలను బంద్ చేశారు.
భానుడు భగభగమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 20 మంది లబ్ధిదారులకు ఉచితంగా మోటార్ ట్రైసైకిళ్లను అందజేశారు.
ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో వరి, మక్కల కొనుగోళ్ళలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
కుక్కలగూడూర్లో మంళవారం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ఉపాఽధిహామీ కూలీలతో ముఖాముఖి చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పనులను పరిశీ లించారు.
వరి, మక్క ఉత్పత్తులు విక్రయించుకోవడానికి నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అదనపు తూకంతో రైతులు నష్టపోతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైస్మిల్లుల కేటాయింపు జరగక ముందే కొనుగోలు కేంద్రాలను ఆరంభించారన్నారు.