Home » Peddapalli
రామగుండాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గురువారం రామగుండం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు మద్దెల దినేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఖర్చు తక్కువగా ఉండి అత్యధి క లాభాలు రావాలంటే రైతులు ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి చూపాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్పామ్ రీసర్చ్ సంస్థ ప్రఽధాన శాస్త్ర వేత్త డాక్టర్ రాంచంద్రుడు అన్నారు. సుల్తానాబాద్ మండలం కొదురు పాకలో గురువారం మెగా అయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వ హించారు.
సింగరేణిపై ఉంటే వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్క్లబ్లో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశం వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు.
నేరాల దర్యాప్తును శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మంగళవారం కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీమీట్ను ఆయన ప్రారంభించారు.
సివిల్ సమస్యలపై ప్రజలు పోలీస్స్టేష న్లను ఆశ్రయించవద్దని, వాటిని కోర్టుల పరిధిలో పరిష్కరించుకోవాలని డీసీపీ రాం రెడ్డి సూచించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ను ఏసీపీ జి.కృష్ణ, సీఐ కె.ప్రవీణ్కు మార్తో కలిసి సందర్శించారు.
కమీషన్ల కోసమే కాళే శ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దోచుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పేర్కొన్నారు. నందన గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సింగరేణి అధికారులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరిం చాలని ఆరు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆం దోళనలు నిర్వహిస్తున్నారు. సింగరేణి అధికారుల సం ఘం(సీఎంఓఏ) ఎనిమిది ప్రధాన డిమాండ్లతో నెల రోజులుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగింది.
అంటరాని వారికి సమానత్వం అందించడానికి బాబు జగ్జీవన్రామ్ ఎంతో కృషి చేశాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం కొత్తూర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధా న్యతనిచ్చి పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.