Home » Peddapalli
మండలంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధ్యానం తడిసిపోయింది. పత్తిపాక కొనుగోలు కేంద్రంలో సోమవారం సాయంత్రం వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో ధాన్యంపై కవర్లు కప్పే సమయం కూడా రైతులకు లభించలేదు.
రాష్ట్రం లో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం నిల్వ చేసేం దుకు గోదాంల నిర్మాణాలకు చర్యలు చేపడుతు న్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగే శ్వర్రావు తెలిపారు. రాఘవపూర్లోని జీఎంఆర్ గోదాంలను సోమవారం సందర్శించారు.
కొనుగోలు కేంద్రాలలో ఉన్న ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, ప్రతిపక్షాల ఉచ్చులో పడి రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. సుల్తానాబాద్ సహకార సంఘంలో సోమవారం రైతులకు జీలుగు విత్తనాల బస్తాలను పంపిణీ చేశారు.
ప్రభుత్వం సవరించిన వేతనాలను పునఃపరిశీలన చేసి శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనం నిర్ణయించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఐఎఫ్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం యూనియన్ ఆఫీస్లో జరిగింది. ఈసందర్భంగా ఐ కృష్ణ మాట్లాడారు.
నేరాల నియంత్రణ కు ప్రజలు సహకరించాలని, ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్ అని డీసీపీ రాం రెడ్డినాయక్ అన్నారు. గోదావ రిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్ పరి ధిలో తిలక్నగర్లో నేర నియంత్రణ, ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం రాత్రి వన్టౌన్ సీఐ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వ హించారు.
రైతు ప్రభు త్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి, మంత్రులు, రైతు లను గాలికి వదిలి తమాషా చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కటింగ్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదివారం మండల కేంద్రంలో రాస్తా రోకో చేశారు.
భానుడు భగభగమంటున్నాడు. 15 రోజులుగా ఎండలు దంచికొట్టుతున్నాయి. ఆదివారం జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఏడుగంటలకే సూర్యుడు సురసురమంటున్నాడు.
జిల్లాలో అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మూడు సంస్థల గ్రూప్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జిల్లాలోని మూడు మండలాల్లో 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తు రాష్ట్ర కేబినెట్ శనివారం తీర్మానించింది. చొప్పదండి మండలం లోని రుక్మాపూర్ గ్రామంలో అసోం రైఫిల్స్ సెంటర్ ఏర్పాటు కానున్నది.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కలెక్టర్ నుంచి మొదలుకొని ఇతర అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జిల్లా యంత్రాంగానికి ధాన్యం సేకరణ ప్రధాన టార్గెట్గా మారింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని, ఈనెల 26న కేరళలోకి ప్రవేశించి పది రోజుల్లో తెలంగాణలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయినా వేగం పుంజుకుంటున్నాయి. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారుల నిరంతర పర్యవేక్షణతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తుండడంతో కొనుగోళ్లలో వేగం పెరి గింది. క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ, రోజుకు కనీసం 15 వేల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇదే సమయానికి 42 వేల టన్నులు వెనుకబడినప్పటికీ వేగం పెరిగింది.