Home » Peddapalli
ఇంటర్ పరీక్షలను కట్టుది ట్టంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశిం చారు. మంగళవారం పరీక్షల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ కోయశ్రీహర్ష, అద నపు కలెక్టర్ అరుణశ్రీతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. కలెక్టరెట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
నాగర్కర్నూల్ జిల్లా కొమెర గ్రామంలో అగ్రవర్ణాల అహంకారానికి రజక కుటుంబానికి చెందిన పసికందు బలికావడం అత్యంత హేయమైన చర్య అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష అన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి అండగా ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అ న్నారు. సోమవారం శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణలో అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
మల్లేపల్లి లక్ష్మయ్య దంప తులకు అవార్డులు వచ్చిన సందర్భంగా ఆదివారం సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు హైదరాబా ద్లోని వారి నివాసంలో కలిసి సన్మానిం చారు.
పంచాయతీ లెక్కలు అడిగితే రికార్డులు రాస్తారా అంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్ మారం కొమురయ్య ఆక్షేపించారు. ధూళికట్ట గ్రామపంచాయతీ కార్యాలయంలో పలువురు వార్డు సభ్యులతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని అన్ని రంగాల కళాకారులకు ఒక బలమైన ఐక్యవేదికగా కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని స్నేహసాహితీ గ్రంథాలయంలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబం పై జరిగిన దాడిని నిరసిస్తూ సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి రజకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిం చి నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి రెండు నెలల చిన్నారి ప్రాణాలు బలి తీసుకున్నారని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తపల్లి మున్సిపాలిటీ, శివారు గ్రామాల విలీనంతో నగరపాలక సంస్థ విస్తీర్ణం, జనాభా పెరిగింది. కాని ఆ స్థాయిలో నిధులు రావడం లేదు. దీంతో నగరవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు.