Home » Peddapalli
ఉన్నత విద్యాభ్యాసానికి టర్నింగ్ పాయింట్ అయిన ఇంటర్మీడియెట్ విద్యలో మారుతున్న కాలానికి అనుగు ణంగా సమూల మార్పులు తీసుక వచ్చేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేసింది. కొన్నేళ్ళుగా అమల్లో ఉన్న పాత విధానాలకు స్వస్తి పలికింది. విద్యార్థుల్లో పఠనా సక్తి, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెం చేలా ఇంటర్ సిలబస్లో మార్పులు తీసుకువచ్చింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎన్టీపీసీ డిప్యూటీడీజీఎం (హెచ్ఆర్) ప్రవీణ్ చౌదరి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం నాగభూషణం పిలుపుని చ్చారు. గురువారం ఆర్టీసీ, ఎన్టీపీసీ అధికారులు సంయుక్తంగా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ ఆవరణలో మొక్కలను నాటారు.
వానాకాలంలో ఓసీపీలో ఉత్పత్తికి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సింగ రేణి సంస్థ చైర్మన్అండ్మేనేజింగ్ డైరెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అన్నారు. గురువారం ఆర్జీ-2 ఏరియాలో పర్యటించారు. ఓసీపీ-3 సీహెచ్పీ ఆధునికీకరణ పనులను పరిశీలించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాత లకు అడుగడుగునా అన్యాయమే జరుగు తోందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకు న్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా గడిచిన రెండున్నరేళ్లలో అదనంగా 16,479 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేశామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసన ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి అడ్లూరి లక్ష్మన్ కుమార్ పాల్గొన్నారు.
మక్కలు దిగు మతి చేసుకోవాలని మండల కేంద్రంలో రైతులు మం గళవారం రాస్తారోకో చేపట్టారు. ఓదెల మండలంలోని మొక్కజొన్న రైతులు పొత్కపల్లి మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకువచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న విధానాల వల్ల విద్యారంగం రోజురోజుకు నిర్లక్ష్యానికి గురవుతుం దని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ ప్రధాన కార్యదర్శి రఘుశంకర్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డిజిటల్ నైపు ణ్యాల అభివృద్ధికి నిర్వహించిన సూపర్ సమ్మర్ కంప్యూటర్ శిక్షణ ఎంతో దోహదపడిందని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలు గాజనవేణ మల్లమ్మ వడదెబ్బతో మృతి చెందడానికి కారణమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీని వెంటనే విధుల నుంచి తొలగించాలని, మల్లమ్మ కుటుంబానికి రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సి పల్ కార్పొరేషన్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు.