Home » Peddapalli
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. గోదావరిఖని బస్టాండ్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కా రం చూపడంతోపాటు భూ భారతి సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మాతా శిశువు ఆసుపత్రిలో వెద్యులను నియమించాలని, లేని పక్షంలో మహిళలతో కలిసి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని మంథని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ హెచ్చరించారు.
పెద్దపల్లి పట్టణం ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. పట్టణం ప్రారంభం రంగంపల్లి నుంచి మంథని ఫ్లైవోవర్ వరకు ప్రయాణించడం గగనంగా మారింది. పలు యూటర్న్లు, సిగ్నల్స్ ఉన్నప్పటికీ రాజీవ్ రహదారి పట్టణం నుంచే ఉండడంతో గందరగోళంగా తయారైంది
ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని రామయ్యపల్లి సర్పంచ్ మూల మంగ కోరారు. శుక్రవారం రచ్చపల్లికి చెందిన గాగిరెడ్డి సునంద, హేమలత వ్యవసాయ క్షేత్రంలోని 6 ఎకరాల్లో మొక్కలను నాటారు.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది.
జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు నాణ్యమైన విద్యనందిం చాలని ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు కలెక్టర్ కోయశ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.
సింగ రేణిని భ్రష్టుపట్టించిన చరిత్ర బీఆర్ఎస్దని, తొమ్మిదేళ్లలో సింగరేణిలో దొంగ లెక్కలు చూపించి సంస్థను నాశనం చేశారని రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నా రు.
సాగు నీటి లభ్యత లేని ప్రాం తాల్లో రైతులు వరి సాగు చేయవద్దని, సూపర్ ఎల్నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరా బాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళి కలను రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ లో మాట్లాడారు.