Home » Peddapalli
మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. రిజర్వే షన్లపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ను హైద రాబాదులోని సీడీఎంఏ ఆఫీసులో, పెద్దపల్లిలోని కలె క్టరేట్లో ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా వార్డుల కేటాయింపు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు డ్రా నిర్వహించనున్నారు.
సింగరేణి సంస్థ లక్షలాది మంది ప్రజలకు తిండి పెడుతుందని, మున్సి పల్ కార్పొరేషన్కు సింగరేణి పేరును వాడుకలోకి తీసు కురావాలని ప్రతిపాదిస్తున్నట్టు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి మూలాధారమైన సింగ రేణిని స్మరించుకునేలా అందరూ ఆమోదిస్తే పేరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
బుధవారం గోదా రంగనాథుల స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు ఆధ్వర్యంలో నిర్వ హించిన కల్యాణంలో దంపతులు కన్యాదాతలు గా వ్యవహరించారు.
హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దులతో విన్యాసాలు.. చిన్నారులు కోలాటాలు, మహిళల రంగవల్లు లతో సందడి నెలకొంది. సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్లో నిర్వహిం చిన భోగి సంబరాలు అంబరాన్నంటాయి.
సింగరేణి సంస్థ నిర్థేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్(పిఅండ్ పి)వెంకటేశ్వర్రావు అన్నారు. బుధవారం సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్లలో పర్య టించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్ పట్టణానికి మహర్దశ చేకూరిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వార్డులకు సంబంధించిన ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ళ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పాత జెండా చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు.
ఎన్టీపీసీ జ్యోతినగర్లోని హరిహర ఆల యంలో మంగళవారం పద్మావతి గోదాసమే త వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా రం గనాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
వాహ నదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద బొంకూర్లో రూరల్ ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో అరైవ్ - అలైవ్ కార్యక్రమం ఏర్పాటుచేశారు. డీసీపీ, ఏసీపీ గజ్జి కృష్ణలు హాజరయ్యారు.
అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. మంగళవారం రంగంపల్లిలోని 10, 11 వార్డుల్లో అర్హులైన 36 మంది ఇండ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి భూమి పూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
కళ కళలాడే రంగవల్లులు..., గొబ్బెమ్మలతో ముం గిళ్ళు... ఇంటింటా పిండివంటలు... ఆకాశన్నంటే గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేసే పిల్లలు, పెద్దల సందడి... ఇలా జిల్లాలోని పల్లెలు...పట్టణాల్లో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది.