Home » Peddapalli
డివిజన్ వారీగా వర్షాకాల సన్నద్దత కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని రామగుండం నగర పాలక సంస్థ కమిష నర్ జే అరుణశ్రీ ఆదేశించారు. మంగళవారం కార్పొ రేషన్ కార్యాలయంలో వార్డు అధికారులతో నిర్వహిం చిన సమావేశంలో మాట్లాడారు.
సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువు నుంచి ఇటుక బట్టీలకు వెళ్తున్న మట్టి టిప్పర్లు అధిక లోడ్లతో వస్తున్నాయని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు, నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేష్ టిప్పర్ ఎదుట పడుకుని నిరసన వ్యక్తం చేశారు.
యువశక్తి ప్రోగ్రాంతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి భారత సైన్యం లో అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.
గ్రామ,వార్డు సభల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవా రం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలె క్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
చెరువుల్లో పూడికతీత, ఆధునికీకరణ పనుల పేరిట తీసిన మట్టిని రైతుల పొలాల పేరు చొప్పుకొని కొందరు భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. చెరువుల్లో ఎక్స్కవేటర్లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి అర్థరాత్రి వరకు వందలాది ట్రాక్టర్లతో మట్టిని ఇటుక బట్టిలు, వెంచర్లు, ప్రైవేట్ ఇంటి నిర్మాణస్థలాలు, ఇతర కమర్షియల్ పనులకు తరలించి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
గాలి వాన బీభత్సం వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ ఆదుకుంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. ధర్మారం మండలంలో ఆదివారం గాలివానతో దెబ్బతిన్న పలు ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. బాధితులు బాధపడవద్దని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని చెప్పారు.
త్వరలో రాష్ట్రంలో రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో నిర్మాణాలు పూర్తి చేసు కున్న ఇందిరమ్మ ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ మెరిట్ విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశ అభివృద్ధిలో పల్లెలే కీలకపాత్ర పోషిస్తాయి. అనేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోక వెక్కిరిస్తున్నాయి. కనీస అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు నిధుల కోసం ఎదురు చూస్తుంటారు. గ్రామాలకు ప్రధాన వనరుగా ఆర్థిక సంఘం నిధులే ఊరట కలిగిస్తాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పల్లెలకు ఆర్థిక భరోసా కలుగుతుందని భావిస్తున్నారు.