Home » Peddapalli
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ఉద్యోగాల్లో కోత పెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు తెలు స్తున్నది. పరిశ్రమలో ఈ ఏడాది సాంకేతిక అవరోధా లతో ఉత్పత్తి నిలిచిపోవడం, నష్టాల నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాలని, ఈ మేరకు వేతన భారం కూడా తగ్గించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజ ర్స్ (డీవోఎఫ్) సూచించినట్టు సమాచారం.
హోలీ పండుగను పురస్కరించుకుని సుల్తానాబాద్ పట్టణంలో సోమవారం కామ దహనం వేడుకలను మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ సమత దంపతులు సోమవారం రాత్రి ప్రారంభించారు.
మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వెంకట్రావుపల్లిలో సోమవారం ఎమ్మెల్యే పాఠశాల ప్రహరీకి రూ.10 లక్షలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షలు, స్వశక్తి మహిళా భవన నిర్మాణానికి రూ.10లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు ప్రణాళికబద్దంగా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో 2027 జూన్ 26లో జరగనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ఝా, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్లో శ్రీపాదరావు జయంతి వేడుకలను డీసీపీ రాంరెడ్డి, పలు శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు.
సింగరేణిని రక్షించు కోవడానికి కార్మికవర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నట్టు సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పిలుపునిచ్చారు. గురువారం ఓసీపీ-1 సీహెచ్పీ ఆవరణలో జరిగిన గేట్ మీటింగ్లో మాట్లాడారు.
సింగరేణిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాల జీఓలోని బీ కేటగిరి వేతనాలను చెల్లించా లని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ డిమాండ్ చేశారు.
గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా మని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం ర్యాకల్దేవుపల్లిలో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భూమి పూజ చేశారు.
రామగుండం నగర మేయర్గా ఎన్నికైన మహంకాళి స్వామి గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొదట వేద పండితులతో మేయర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఎన్టీపీసీ దక్షిణ రీజియన్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ ఆరిందం సిన్హా బుధవారం రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో పర్యటించారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరు కున్న ఆర్ఈడీ సిన్హాకు ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.