Home » Peddapalli
కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పవిత్ర ఆరోగ్య సిబ్బందిని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధి కారి కరపత్రం విడుదల చేశారు.
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి నింది తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అధి కారులను హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో అర్థవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
కూనారం రైల్వే ఫ్లైఓవర్ (ఆర్వోబీ) నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి నెలాఖరు లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధి కారులను ఆదేశించారు. సోమవారం కూనారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పెద్దపట్నం, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. ఆలయంలోని వీరభద్ర స్వామి క్షేత్రంలో ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సభ్యులు, ఈవో సదయ్య సమక్షంలో పురోహితులు వీరభద్రారాధన నిర్వహించారు.
రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ఆరోపించారు.
బడుగు, బలహీన వర్గాలంతా ఓటు హక్కుతోనే అందరితో సమానంగా గౌరవించబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సర్ ప్రోగాంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్నగర్లో ఓటర్లకు ఓటు హక్కు పై పుట్ట మధు ఆదివారం అవగాహన కల్పించారు.
యువతలో మార్పు రావాలంటే తల్లిదండ్రుల కృషి అవసరమని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి నాయక్ అన్నారు. ఆదివారం రాత్రి కొత్తపల్లిలో ఎస్ఐ ప్రవీణ్కుమార్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన గంజాయి - మత్తు పదార్ధాల నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
కరీంనగర్కు చెందిన ఒక యువకుడు తన ఇంటిలోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం ద్వారా సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ నెలలో అతని బ్యాంక్ ఖాతా నుంచి 98 వేల రూపాయలు సంతోష్కుమార్ బహేలి అనే గుర్తుతెలియని వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు బాధితుడికి బ్యాంక్ నుంచి మెస్సేజ్ వచ్చింది. అయితే తాను ఎలాంటి లింక్లు, మెస్సేజ్లు ఓపెన చేలేదని, బ్యాంక్ లావాదేవీలు కూడా జరపలేదని బాధితుడు పోలీసులకు తెలిపాడు.
యూరియా అధిక వాడకం తగ్గించడం, పం పిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొ చ్చిన యూరియా యాప్ సత్ఫలితాలనిస్తోంది. గత యాసంగి సీజన్లో రాష్ట్రంలో తొలిసారిగా యాప్ను పెద్దపల్లి జిల్లాలో అమలు చేశారు.