Home » Peddapalli
స్వయం ఉపాధి చేసుకుంటూ జీవించే మహిళలకు ఇచ్చే స్త్రీనిధి రుణాల పంపిణీ, చెల్లింపుల విషయంలో జరుగుతున్న మోసాలకు చెక్పడింది. రుణాలు పొందిన మహిళలు నేరుగా యాప్ ద్వారానే డబ్బులు చెల్లించేం దుకు ప్రభుత్వం తీసుకవచ్చిన ‘మన స్త్రీ నిఽధి యాప్’ గురించి డీఆర్డీవో అధికారులు, సిబ్బంది, స్త్రీ నిధి బ్యాంకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
మండ లంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మార్ అన్నారు. సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మండలంలో పర్యటించి ఎంపి డిఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
సర్పంచ్లు ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్దబొం కూర్లోని మదర్థెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్ర మంలో కలెక్టర్ పాల్గొన్నారు.
పదేళ్లుగా బకాయిలు చెల్లిం చకుండా ఆర్టీసీ యాజమాన్యం వేధిస్తుందని, తమకు చావే దిక్కని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నాగేందర్, వెంగళ కనకయ్య అన్నారు. బకాయిలు చెల్లించాలంటూ శనివారం గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగారు.
ఎన్ని కల సందర్భంలో తాము ఇచ్చిన హామీ లన్నింటినీ నెరువేరుస్తామని, గత పాలకుల మాదిరిగా మోసం చేసే వాళ్లం కాదని ఎమ్మెల్యే చింత కుంట విజయరమ ణారావు అన్నారు.
రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి, అభివృద్ధికి తాను ఎల్లవే ళలా కృషి చేస్తున్నానని, ఓర్వలేని వారు చేస్తున్న విమర్శ లకు అభివృద్ధితోనే జవాబు చెబుదామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో రూ.20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ఆయన ప్రారం భించారు.
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వార్డుల సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు సైతం మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవటానికి రాజకీయ వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వశాఖల మధ్య సమన్వ యంతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని రామగుం డం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల ప్రాణ రక్షణే ఉద్దేశ్యంగా చేపట్టిన అరైవ్... అలైవ్... కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఐటీఐ మైదానంలో వాకర్స్ ట్రాక్, స్విమ్మింగ్ఫూల్, బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి సీసీ రోడ్డు, డైన్రేజీలు మహిళా పోలీస్స్టేషన్లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ సుమారు 4 కోట్ల 59 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.