Home » Peddapalli
ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని పెద్దబొంకూర్లో రాజేశం అనే రైతు అయిల్పామ్ సాగు చేయగా క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖ అధికారులు సందర్శించారు.
నేరస్థులకు శిక్ష పడడంలో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర కీలక మని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం కమి షనరేట్లో కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సింగరేణిలో అవినీతి, కుంభకో ణాలకు కారణం బీఆర్ఎస్సేనని రామగుండం నగర మేయర్ మహం కాళి స్వామి బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లు సింగరేణిని దోచుకున్న కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు దద్దమ్మల్లాగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ హఠావో అనే నినాదంతోనే 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందపెట్టి కాంగ్రెస్ను కార్మికులే అధికారంలోకి తీసుకువచ్చాన్నారు.
పెద్దపల్లి నియోజక వర్గ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి సం బంధిత రైస్మిల్లులకు తర లించేందుకు చర్యలు చేప ట్టామని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే చింతకుంట విజయరమ ణారావు తెలిపారు.
విద్య తోనే బాలికా సాధికారత సాధ్యమని ఎన్టీపీసీ ఈడీ చందన్కుమార్ సామంత అన్నారు. శుక్రవారం పీటీఎస్లోని కాకతీయ ఆడిటోరి యంలో జరిగిన బాలిక సాధికారత మిషణ్ శిక్షణలో ప్రసంగించారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోదావరి ఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఆమె మొక్కలు నాటారు.
ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళా లని, రామగుండంను రాష్ట్రంలోనే నెంబర్ స్థానంలోకి తీసుకెళుతానని ఎమ్మెల్యే మక్కా న్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ప్రగతి ప్రణా ళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా 60 డివిజన్ల క్లస్టర్ స్థాయి వార్డు సభను గురు వారం ఆర్సీఓఏ క్లబ్లో మేయర్ అధ్యక్షతన నిర్వహించారు.
మండలం లోని నిట్టూరులో బుధవారం రాత్రి బీఆర్ఎస్ నాయ కులు, ప్రజలపై రూరల్ పోలీసులు జరిపిన లాఠీఛార్జీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో బాధితులను పరామర్శించారు.
సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయో కురవవో అన్న బెంగ రైతులు పెట్టుకోవద్దని, ప్రస్తుతం సమృద్ధిగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సదస్సులో గురువారం ఆయన మాట్లాడారు.