Home » Peddapalli
సింగరేణిలో కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూని యన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్లు పేర్కొన్నారు. గురువారం గోదావరిఖనిలో ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సమావేశంలో జరిగిన వివరాలను వెల్లడిం చారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని, అవసరమైన మందుల కొరత రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ఎస్టీపీ ప్రాజెక్టుల్లో 55వ జాతీయ భద్రతా దినోత్సవ వేడుకలు గురువా రం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత పాల్గొన్నారు.
గోదావరి పుష్కర పనులకు సమగ్ర డీపీఆర్ రూపొందించనున్నట్టు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్, ఇరిగేషన్, ఎస్కే కన్సల్టెంట్ ప్రతినిధి రంగారెడ్డితో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యలు పుష్కరాలు జరిగే గోదావరిఖని పుష్కరఘాట్, మల్కాపూర్ శివారు, సింగరేణి ఇన్టేక్ వెల్, జన గామ నదీ తీరాలను సందర్శించారు.
పట్టణంలోని పలు ఆలయాలను చంద్రగహం సందర్భంగా మంగళవారం ఉదయం పూజారులు మూసి వేశారు. సాయంత్రం చంద్రగ్రహణం కావడంతో ఉదయం వేళలోనే ఆల యాల్లో సాయంత్రం, రాత్రి నిర్వహించే వైదిక కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆలయాలను మూసి వేశారు.
గోదా వరి నది పుష్కరాలు-2027 దృష్ట్యా రామగుం డం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించారు.
ఈసాల తక్కళ్లపల్లి బీట్కు చెందిన బుగ్గ అటవీ ప్రాంతంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దపల్లి అటవీ రేంజ్ అధికారి సతీష్ కుమార్ అఽధ్వర్యంలో పారెస్టు అధికారులు, సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ, శుభ్రత చేపట్టారు.
యువత కేరింతలు, నృత్యాలు, చిన్నారుల సందడి మధ్య జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు మంగళవారం వైభవంగా సాగాయి. ఉదయం నుంచే గ్రామాల నుంచి పట్టణాల వరకు హోలీ సందడి కనిపించింది. మున్సిపల్ కౌన్సిల్, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అన్నీ వర్గాల ప్రజలు వేడుకల్లో భాగస్వాములయ్యారు.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశబ్దకాలంగా నిధులు లేక ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) పథకాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఎట్టకేలకు ఆత్మ పథకానికి మోక్షం లభించింది.
రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు లేక గ్రామాలు అనేక సమ స్యలతో కొట్టుమిట్టాడాయి. చాలా గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుతీరడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర విడుదల చేసింది. ఈ క్రమంలో మాజీ సర్పంచ్లు పాత బకాయిలు ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుత, మాజీ సర్పంచుల మధ్య బిల్లుల గొడవకు దారి తీసింది.