Home » Peddapalli
రాష్ట్రంలో నెల కొన్న సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు లు అధిక నీటి అవసరమయ్యే వరి పంటలకు బదు లు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలె క్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కొలనూర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపో యని కారణంగానే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్కు మార్ విమర్శించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రశాంత్నగర్, శ్రీనగర్ కాలనీల్లో పరిశీలించారు.
భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సబ్బితం పంచాయతీ కార్యా లయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యా యన్నారు.
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణలో తొలి బ్యాచ్లో 1200 మంది శిక్షణ పొందడం అభినందనీయమని తెలిపారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ - తిరుచానూర్ - నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు.
భూముల రీ సర్వేకు జిల్లాలో ప్రభుత్వం70 గ్రామాలను ఎంపిక చేసినట్లు డీఆర్వో రాజేశ్వరి తెలిపారు. మంగళవారం మంగపేటలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ మండలంలో ఐదు గ్రామాలు ఎంపిక చేయగా, అందులో మంగపేటలో రీసర్వే చేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలో డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్ పక్కన గల పెట్ గోదాం వద్ద రైస్మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు.