Home » Peddapalli
మహిళలను కోటీశ్వ రులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్ర మాలు చేపట్టిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరిం చుకొని శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మహిళలను సన్మానించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇక నుంచి చెత్త బయట పడవేసినా, నాలాల్లో పడవేసినా రూ.500 జరిమానా విధించనున్నట్టు మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా స్థానిక 49వ డివిజన్ మార్కండేయకాలనీలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సంతోష్రావుతో కలిసి ప్రధాన నాలా పూడిక తీత పనులను పరిశీలించారు.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) ఎల్ఎన్జీ సరఫరాను తగ్గించడంతో ప్రస్తుతం ప్లాంట్ను 50శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు.
వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఈవోలపై పనిభారం తగ్గించాలని శుక్రవారం బ్రాహ్మణపల్లి రైతువేదికలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్కు జిల్లా ఏఈవోలు వినతిపత్రం అందించారు.
ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష నిర్వహించారు.
కల్తీలేని ఆహారం తీసుకుంటేనే ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ పాల్గొని మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని, వాటి ఫలాలు అర్హులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తిపన్ను వసూళ్లపై ఇందిరమ్మ ఇళ్ల సర్వే, మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడింది. 2024-26 ఆర్థిక సంవత్సరంలో నగరంలోని నివాస, వాణిజ్య, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, చారిటీ సంస్థలకు సంబంధించిన భవనాలు, ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్నులు 60 కోట్ల రూపాయలకుపైగానే వస్తుందని అంచనా వేశారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆదేశించింది.
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు గడిచిపోయిన సంక్షేమ పథకాలు మినహా ప్రత్యేక అభివృద్ధి మార్క్ కనిపించడం లేదనే విమర్శలు జిల్లాలో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పల్లెలు, పట్టణాల్లో చాలా నెలలు స్థానిక సంస్థలకు పాలకులు లేక అభివృద్ధిని పట్టించుకునే వారు లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నది. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులపాటు ప్రజాపాలన.. ప్రగతి నివేదన అనే అంశంపై వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.