Home » Peddapalli
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశాలున్నాయి.. ఇందుకోసం పేద ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో మాత్రం సిరంజీలు, మందుల కొరత ఏర్పడింది. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సిరంజీల సరఫరా నిలిచిపోయింది.
సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంపై ఆశలు రేకెత్తుతున్నారు. గతంలో దేవస్థానం పునర్నిర్మా ణానికి టీటీడీ మంజూరు చేసిన నిధులతో పనులు చేపట్టడానికి భూమి పూజ చేశారు. మూడేళ్లుగా నిర్మాణ పనుల్లో కదలిక లేకపోవడంతో శ్రీస్వామివారి భక్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న వేళ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పాలకవర్గం దేవస్థానం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి నిర్ణయించింది.
గ్రామ పంచాయతీల సొంత నిధుల వాడకంపై ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి పంచాయతీల కుస్వయం ప్రతిపత్తిని కల్పించడంతో సర్పంచులు, వార్డు సభ్యులు, పం చాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, తల్లిదండ్రులు తప్పనిసరిగా భాగస్వా ములు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం తుర్కల మద్దికుంట ఎంపీపీఎస్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయోధ్య కోర్టు కేసు గెలిపించిన, రామ మందిరాన్ని కట్టించినా అని గొప్పలు చెప్పుకునే మోదీ రామమందిరంలో భక్తుల విరాళాలు చోరీకి గురైతే ఎందుకు మాట్లాడడం లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీ నిధులతో చేసిన పలు అభివృద్ధి పనులను ఎంపీ ప్రారంభించారు.
ప్రైవేట్ పాఠశాలల హంగులు ఆర్భాటాలు చూసి పిల్లలను చేర్పిస్తున్నారని, ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థ వంతంగా అమలు చేసి అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.
రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో సం తకాల సేకరణ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి ఎంచర్ల సాత్విక్కు ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యం లో శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నివాళులర్పించారు.
బందంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దేందుకు మూడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శుక్రవారం మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య, అధికారులతో కలిసి పరిశీలించారు.