Home » Peddapalli
జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించా లని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. బుధవా రం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు.
సింగరేణి టెండర్లలో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బుధవారం ఆర్జీ-1 జీఎం ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు.
ఎంసీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికే విద్యుత్ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు.
క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టిజిఎన్పిడిసి ఎల్ ఏఈ రాజేందర్ తెలిపారు. అడవీ శ్రీరాంపూర్లో మంగళవారం ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు.
నిరుపేదలందరికి విడుతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లు పనులు ప్రారంభించి ప్రొసిడింగ్లు అందజేసిన అనం తరం మాట్లాడారు.
గోదావరిఖని సమ్మక్క - సారలమ్మ జాతర పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మక్కా న్సింగ్ రాజ్ఠాకూర్ అధికారులకు సూచించారు. మంగళవారం జాతర ప్రాంగణంలో ఆర్జీ-1 జీఎం లలిత్కుమార్తో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, మంథని బస్టాండ్లలో ప్రత్యేకించి జాతర క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి 410 బస్సులను మేడారం నడపనున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై రోజుకో రకంగా ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ వస్తోందని ఒకసారి, ఫిబ్రవరిలో పోలింగ్ ఉంటుందని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్, పట్టణాల్లో రాజకీయాలు వేడెక్కాయి.
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్,వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో సిరిసిల్ల, వేములవాడలో రాజకీయ సందడి మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పెద్దలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో తలమునకలవుతున్నారు.