Home » Peddapalli
రైతులు కాం గ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ప్రశ్నిం చారు. జిల్లా కేంద్రంలోని తిరుమల గార్డెన్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు.
సింగ రేణిలో సగం మంది కారుణ్య ఉద్యోగులేనని, బీఆర్ఎస్ పదేళ్లపాలనలో కారుణ్య నియామ కాల పేర 19,500మంది ఉద్యోగాలు పొందారని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. టీబీజీకే ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీలోని ఒక ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో నినాదంతో సింగరేణి పరిరక్షణ సద స్సుకు ఆయన హాజరయ్యారు.
ఆరోగ్యకరమైన జీవనం కోసం హ్యాపీ సండే కార్యక్రమం అవసరమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు డిజిటల్ స్ర్కీన్స్కు అలవాటు పడి శారీరక, మానసిక సామర్ధ్యాన్ని కోల్పోతున్నారన్నారు.
సీఎం రేవంత్రెడ్డిపై.. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ను చూసి హైడ్రా పెట్టానని అంటావా....? కళ్లు నెత్తికి ఎక్కాయా..? అని ధ్వజమెత్తారు.
గ్రానైట్ అక్రమాలపై కేంద్రం దృష్టిసారించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానికంగా ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఈ అక్రమ దందాలు, వేల కోట్ల స్వాహా అంటూ వచ్చిన ఫిర్యాదుల ఫైళ్ల గుట్టు విప్పేందుకు సిద్ధమైంది.
తొలకరికే తొందరపడి విత్తనాలు వేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన జగిత్యాలపై పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎ
జిల్లాలో ఇప్పటికే పౌరసరఫరాల శాఖ యాసంగిలో ధాన్యం కొనుగోలు అంచనా దాటి సేకరిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి 4 లక్షల 56 వేల 664 మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 3 లక్షల 3,940 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం కొనసాగనుంది.
జిల్లాలో గల మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ప్రభుత్వం విద్యా ర్థులకు సరిపడా మెస్ చార్జీలను పెంచినప్పటికీ పౌష్టికాహారం లభించడం లేదు. కూరగాయలు, చికెన్, మటన్, కోడిగుడ్లు సర ఫరా చేసే కాంట్రాక్టర్లు నాణ్యత లేని, నాసిరకం సరుకులను సర ఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సమిష్టి కృషితో రామగుంగం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మేయర్ మహంకాళిస్వామి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఎన్సీఓఏ క్లబ్లో కాలనీలోని ఏడు డివిజన్లలో వార్డు సభ జరిగింది.
ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం.విన య్నాయక్ అన్నారు. శనివారం పారుపల్లి గ్రామ పరిధిలో మైదంబండ బీట్, బేగంపేట సెక్షన్లో ఉన్న పారుపల్లి పెద్ద చెరువు వద్ద బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.