Home » Pawan Kalyan
హైదరాబాద్లో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు మల్కం చెరువు సమీపంలోని పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ (17)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. బుధవారం హనుమకొండ, హనుమాన్ నగర్లోని బాలుడి ఇంటికి వెళ్లారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని విజయవాడలో పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారు. కానీ, నేను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వరు.
జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, పాప ఆచూకీ కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్వహించిన సభ విజయవంతమైంది.
గ్రామాల బలోపేతమే దేశాభివృద్ధికి పునాది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామసభలు, పంచాయతీలకు మరింత అధికారాలు, బాధ్యతలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుతామని స్పష్టం చేశారు.
తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. లింగమనేని పేరును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు వెల్లడించింది.