Home » Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జనసేన నేత, స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయ పడ్డారు.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తన నివాసానికి రాలేదని ఆగ్రహం తెచ్చుకున్న ముద్రగడ.. ఆ తరువాత వైసీపీలో చేరి పవన్పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన కూతురికే నచ్చడం లేదు. దీంతో ముద్రగడ కూతురు మీడియా ముందుకు వచ్చి మరీ తన తండ్రి వైసీపీ అధినేత జగన్ ఆడిస్తున్నట్టు ఆడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు
నేడు రాజమండ్రిలో విజయ శంఖారావం సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకే వేదికను పంచుకోనున్నారు. జగదల్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. 2.30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2.50 గంటలకు వేమగిరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
మెగా కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో..
మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లుగా వైసీపీ (YSRCP) పాలన ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. తునిలో ఆదివారం ‘‘వారాహి విజయభేరి’’ సభ వేదికగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తునిపై హామీల వర్షం కురిపించారు.
సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.
తాను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఆయన రేపల్లెలో జరిగిన వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందన్నారు.
జనసేన స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు (Ambati Rayudu) తన ప్రసంగంతో ఇరగదీస్తున్నారు. అటు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ను (Pawan Kalyan) ఆకాశానికెత్తేస్తున్నారు..
21 స్థానాల్లో అభ్యర్థులను దింపిన జనసేనాని ఈ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం నిర్మాతగా.. కింగ్ మేకర్గా వ్యవహరిస్తారా? అని పవన్ కల్యాణ్ను ప్రశ్నించగా.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.