Home » Pakistan
సరిహద్దు ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఉగ్రవాదులకు ఎలాంటి నిబంధనలు ఉండవని, వారికి వారి భాషలోనే సమధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దుల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని, వారిని పాక్గడ్డపైకి అడుగుపెట్టయినా సరే మట్టుబెడతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారంనాడు గట్టి హెచ్చరిక చేశారు.
సీరియల్స్.. పరిచయం అక్కర్లేని పేరు. ఆడవారు మాత్రమే కాదండోయ్.. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ చూస్తుంటారు. కాలక్షేపం కోసం చాలా మంది వీటిని చూడటం బెస్ట్ ఆప్షన్ గా మార్చుకుంటారు. రీల్ లో జరిగే సీన్స్ అన్నీ రియల్ గానే జరుగుతున్నాయని భావిస్తుంటారు కొందరు.
భారత నౌకాదళం(Indian Navy) మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది. నేవీ సైనికులు మరోసారి ధైర్యసాహసాలు ప్రదర్శించి సముద్రపు దొంగల నుంచి పలువురిని కాపాడారు. ఆ క్రమంలో భారత నౌకాదళం రక్షించిన వారిలో 23 మంది పాకిస్థానీలు(Pakistani nationals) ఉన్నారు. అయితే శుక్రవారం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా వెళుతున్న ఇరాన్ నౌకను తొమ్మిది మంది సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. భారత నేవీ యుద్ధనౌక INS సుమిత్ర సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారులను రక్షించినట్లు భారత రక్షణ అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన పరువు నష్టం కేసులో కోర్టు సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ ( Pakistan ) మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ ముహమ్మద్ చౌదరి దాఖలు చేసిన 20 బిలియన్ రూపాయల పరువు నష్టం కేసును ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది.
తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ (Pakistan) దృష్టి పెట్టకుండా.. భారత్పై (India) అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్పై అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది. అయోధ్య, సీఏఏ అంశాలను ప్రస్తావించి.. భారత్ చేతిలో అభాసుపాలయ్యింది.
కొన్ని సంవత్సరాల నుంచి భారత్, చైనా (India-China Border Conflict) మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం.. సాయుధ పోరాటానికి దారితీయొచ్చని అమెరికా నిఘా వర్గాలు (US Intelligence Reports) హెచ్చరించాయి. గతకొన్నేళ్ల నుంచి సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకోకున్నా.. ఇరుపక్షాల వారు భారీ స్థాయిలో సైనికుల్ని మోహరించడం, ఇలాంటి టైంలో చోటు చేసుకునే అపోహలు.. సాయుధ ఘర్షణకు ప్రేరేపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత అసిఫ్ అలీ జర్దారీ శనివారంనాడు ఎన్నికయ్యారు. పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి.
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.