Home » Nitin Jairam Gadkari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులపై పలువురు కేంద్రమంత్రులను లోకేష్ కలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ ఆరులైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
ఆర్థిక, సాంకేతిక సంపత్తి కారణంగా కొన్ని దేశాలు దాదాగిరికి దిగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ మాత్రం ఇలా ఎన్నడూ చేయదని అన్నారు. సాంకేతికత ఆధారంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్- విజయవాడ రహదారిని మల్కాపూర్ నుంచి అమరావతి వరకు నాలుగు లేన్ల నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు.
తుల్సి బాగ్ రోడ్డులో ఉంటున్న రౌత్.. మెడికల్ చౌక్ సమీపంలోని స్థానిక సారా దుకాణంలో పనిచేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అతను తన మొబైల్ నెంబర్ నుంచి ఫోన్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఫాస్టాగ్ వార్షిక పాస్ లాంఛ్ కానుంది. మరి ఈ పాస్ ఫీచర్స్కు సంబంధించిన పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
Nitin Gadkari Praises Chandrababu: శనివారం నాడు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన, జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లపై ప్రశంసలు కురిపించారు.
గత జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా సరైన విధంగా స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.
పదవులు, సంపద, విజ్ఞానం, అందం లభించినప్పుడు వ్యక్తుల్లో అహంకారం పెరిగిపోతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.