Home » Nirmala Sitharaman
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా రూపొందించిన చీరలో ఆమె కనిపించారు.
2026 బడ్జెట్పై వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు దృష్టి సారించారు. నిర్మలమ్మ తమకు గుడ్న్యూస్ చెబుతారని ఆశపడుతున్నారు. అలాగే 2026-27 వార్షిక బడ్జెట్లో కొన్ని కీలక అంశాలపై చాలా మంది దృష్టి సారించారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి అందించారు. రాష్ట్రపతి బడ్జెట్కు ఆమోదం తెలిపారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 75 ఏళ్ల సాంప్రదాయానికి తెరదించబోతున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆమె పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా చేయబోయే ప్రసంగంలో బడ్జెట్లోని పార్ట్-ఎ కంటే పార్ట్-బి పైనే ఎక్కువగా దృష్టి సారించబోతున్నట్టు సమాచారం.
ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్పై ఆశలు, అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిచ్చారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంతమేరకు మినహాయింపులు ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.
దేశంలో వినియోగానికి ఊపునిచ్చి.. ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బడ్జెట్ ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..
యూనియన్ బడ్జెట్ 2026-27 మీదే ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. ఈసారి బడ్జెట్లో ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. మరి ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా పద్దు ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి? వాటిలో వచ్చిన మార్పులేమిటి? ప్రస్తుత పద్దు విధానం ఎలా ఉండనుందనే విషయాలను ఓసారి పరిశీలిస్తే...
ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2026 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్లో పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, పాత చట్టం నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025కి మారడంపై ప్రభుత్వం దృష్టి సారించనుందని సమాచారం.
ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో సమర్పిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఆదివారం రోజున బడ్జెట్ సమర్పణ జరుగుతుండటం గమనార్హం.