Home » Nirmala Sitharaman
ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026– 2027 కేంద్ర బడ్జెట్ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
డెరివేటివ్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్కు బ్రేకులు వేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్ట్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రకటించారు.
21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా నడుస్తోందని, అందువల్ల సాంకేతికతను సామాన్యుడిగా కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
భారత్లోని డేటా సెంటర్ల ద్వారా గ్లోబల్ కస్టమర్లకు క్లౌడ్ సర్వీసులు అందించే సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో తెలిపారు. అంతేకాకుండా, బీఈఎస్ వ్యవస్థల్లోని లిథియం అయాన్ సెల్స్ తయారీకి వాడే వస్తువులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇవాళ(ఫిబ్రవరి 1) ఆమె 2026-27 ఆర్థిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019 నుంచి 2026 వరకు ఆమె మొత్తంగా 14 గంటలు బడ్జెట్ ప్రసంగం చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1 శాతం తగ్గినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026-27ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పించనున్నారామె. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కాంజీవరం పట్టుచీరలో కనిపించారు. ఆ చీర విశిష్టతలేమిటో తెలుసుకుందాం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విదేశీ టూర్ ప్యాకేజీల విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
కేంద్రం.. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది.
ఆదాయపు పన్ను శ్లాబ్లు యథాతథంగానే ఉంటాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్యాక్స్ల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని తెలిపారు. అలాగే సామాన్యుల సైతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేలా మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు.