Home » Nirmal
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి బాసరకు తరలి వస్తుంటారు. ప్రతి ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Telangana: రోజులు గడుస్తున్నప్పటికీ కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు మాత్రం ఇంకా పూర్తి కాని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రాజెక్ట్లోని నీరు వృధాగా పోతోంది. మరోవైపు తాజాగా కురుస్తున్న వర్షాలకు ఎగవ నుంచి ఇన్ఫ్లో ప్రాజెక్ట్లోకి వచ్చి చేరుతోంది. అయితే మరమ్మతులు పూర్తి కాకపోవడంతో 1, 2, 3 గేట్ల నుంచి నీరు వృధాగా పోతోంది.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలు మరోసారి బట్టబయలయ్యాయి. బాసర గ్రామస్థుల చొరవతో ఆలయ సిబ్బంది అవినీతి బాగోతం బట్టబయలైంది. గ్రామస్థుల ముందస్తు సమాచారం మేరకు అధికారులు ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద శుక్రవారం తనిఖీలు చేపట్టారు.
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ)లో 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది.
రోళ్లు పగిలేంతగా ఎండలు మండే రోహిణి కార్తె శనివారమే ప్రారంభమైంది. 15 రోజుల పాటు ఎండలు, వడగాలులు మరింత తీవ్రమవనున్నాయి. రాష్ట్రంలో నాలుగైదు రోజుల కిందటి వరకు 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదైన ఉష్ణోగ్రత.. మళ్లీ 45 డిగ్రీలు దాటుతోంది.
నిర్మల్ జిల్లా: మహబూబ్ ఘాట్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మందికి గాయాలుకాగా..
అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మునిసిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ పురపాలక సంఘంలో జరిగిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల నియామకాలకు సంబంధించి అప్పటి నిర్మల్ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత తుర్కయాంజల్ మునిసిపల్ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డిని అధికారులు తొలగించారు.
గోదావరి బేసిన్లో ఏటా వరదలతో నిండే ప్రాజెక్టుల్లో ఒకటైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత రెండేళ్లూ భారీ వరదలతో ప్రాజెక్టు చిగురుటాకులా వణికిన విషయం విదితమే.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
నాలుగో విడత ఎన్నికల పోలింగ్కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది.