Home » Nirmal
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- కంటైనర్ లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.
భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఊర్లలో శివాలయం చూసుకుంటారు.. రామాలయం చూసుంటారు.. ఆంజనేయ స్వామి ఆలయాలూ చూసుంటారు. కానీ, కోతి దేవుడి ఆలయం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా? చూడకపోతే మీరు నిర్మల్ జిల్లాలోని ధర్మారం గ్రామానికి వెళ్లాల్సిందే.
ఓటరుకు పల్లె 'పంచాయితీ' పద్మ వ్యూహంలా తయారైంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నాయి. సారధులే స్వయంగా పల్లె బాట పడుతూ.. వ్యూహరచన చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార తీరు మారింది. విందులు, హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గెలుపే టార్గెట్గా ప్రధాన పార్టీల నేతలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. గ్రామ పంచాయతీల ఎన్నికలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారుతున్నాయి. పార్టీరహిత ఎన్నికలు అయినా పరోక్షంగా ప్రధాన పార్టీల మద్దతుదారులే పోటీ పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి వరద పోటెత్తుతోంది. శుక్రవారం మొదలైన ప్రవాహం శనివారం అదే స్థాయిలో కొనసాగింది.
ఐదుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఈ నెల 22న జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.