Home » New Delhi
భారతదేశంపై గతంలో జరిగిన దాడులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రస్తావిస్తూ.. లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు.
జనవరి 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఈ సమావేశాలు ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగుతాయని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని ఆయన కలుసుకున్నారు.
బయో ఇంధనాల వాడకం ద్వారా స్వయం సమృద్ధి భారత్ దిశగా మనం ముందుకు వెళ్లలేమా అని గడ్కరి ప్రశ్నించారు. తాను 100 శాతం ఇథనాల్తో కారును వాడుతున్నానని, ఇది 60 శాతం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తోందని, పొల్యూషన్ అనేదే లేదని చెప్పారు.
ఢిల్లీలో ఉంటున్న ఓ ఆఫ్రికన్ జాతీయుడిని నెల రోజుల్లోపు హిందీ నేర్చుకోవాలంటూ స్థానిక మహిళా కౌన్సిలర్ వార్నింగ్ ఇచ్చిన వైనం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నబీన్ మాట్లాడుతూ, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్షా, రాజ్నాథ్ సింగ్, తనపై నమ్మకం ఉంచిన పార్లమెంటరీ పార్టీకి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపడం, భారత భూభాగం నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎంఈఏ తాజాగా స్పందించింది.
ఆస్ట్రేలియాలోని బాండి బీచ్లో ఉగ్రమూక జరిపిన దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఉగ్రవాదం పట్ల భారతదేశానికి ఏమాత్రం సహనం లేదని, ఉగ్రవాదపు అన్ని రూపాలు.. ప్రదర్శనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము మద్దతిస్తామని భారత ప్రధాని..
దేశాన్ని తుదముట్టించడమే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని ఖర్గే విమర్శించారు. బెంగళూరులో తన కుమారునికి ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ తాను వెళ్లలేదని, ర్యాలీకి హాజరయ్యేందుకు ఇక్కడే ఉండిపోయానని చెప్పారు.
ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్కు ఇమ్యూనిటీ కల్పిస్తూ ప్రధానమంత్రి మోదీ చట్టం తెచ్చారని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి, అవసరమైతే ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.