Home » New Delhi
దేశ రాజధానిలో ఈ నెలాఖరున జరగాల్సిన 4వ 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్'వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.
దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2027 సంవత్సరానికి వార్షిక పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ, సీడీఎస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ వంటి పరీక్షల షెడ్యూల్ను ఇందులో పొందుపరిచారు.
జేఎన్యూ మాజీ విద్యార్థి నేత, 2020 ఢిల్లీ అల్లర్లతో ముడిపడిన కుట్ర కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు నిరాకరించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం-2026లో పాల్గొంటారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వస్తు సేవల పన్ను లావాదేవీలలో జరిగిన భారీ మోసాలకు సంబంధించి పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.100 కోట్ల మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ అరెస్ట్ జరిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
దాదాపు 300 ఏళ్ల క్రితం దేశం దాటి వెళ్లిన 11వ శతాబ్దపు నాటి అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మక చోళుల కాలం నాటి రాగి శాసనాలు నెదర్లాండ్స్ నుంచి తిరిగి భారతదేశానికి చేరనున్నాయి. అయితే, ఈ రాగి శాసనాలు పొందుపరిచిన వలయం మీదున్న రాజముద్రలోని చిహ్నాలు దేనికి సంకేతాలో చూద్దాం..
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక వివాహిత ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ECLGS 5.0 పథకానికి ఆమోదం తెలుపుతూ, దాదాపు రూ. 2.55 లక్షల కోట్ల రుణ పరపతిని కల్పించాలని నిర్ణయించింది.
పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయాన్ని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన, చారిత్రక తీర్పునిచ్చారని, ఆ ఆనందం కార్యకర్తల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్లో నూతన చరిత్రను ఆవిష్కరించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు.