Home » New Delhi
ఫ్రాన్స్లో జరగనున్న 52వ జీ7 దేశాల సదస్సుకు భాగస్వామ్య దేశంగా భారత్ హాజరుకానుంది. భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరవుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతల పెద్దఎత్తున అభినందలు తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడం, సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును మోదీ సొంత చేసుకున్న నేపథ్యంలో ఎన్డీయే నేతల సమావేశం బుధవారంనాడిక్కడ భారత్ మండపంలో జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ అత్యవసరంగా సమావేశమవుతోంది. జూన్ 11న ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బుధవారంనాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని కలిశారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారంనాడు 10 జన్పథ్లో కలుసుకున్నారు. ఐక్యత, భాగస్వామ్య పార్టీల మధ్య మెరుగైన సమన్వయానికి పిలుపునిస్తూ ఇండియా కూటమి సమావేశం ముగిసిన మరుసటి రోజే ఉభయులూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని భారత్కు వచ్చినప్పుడు న్యూఢిల్లీ విమానాశ్రయంలో కొత్త లుక్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
కలిసికట్టుగా ఉంటేనే నిలబడాతామని, విడిపోతే పడిపోతామని లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని భాగస్వామ్య పార్టీలు గుర్తెరిగి, ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని నుంచి ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనున్న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కీలక సమావేశానికి శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వర్చువల్గా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అధికారికంగా ప్రకటించారు.
ఈనెల 8న జరుగనున్న 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇండియా కూటమి తొలిసారి సమవేశమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రవేశ పరీక్షలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పరిష్కరించేందుకు ప్రస్తుత విద్యా వ్యవస్థలో సంస్కరించాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది.