Home » New Delhi
తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్షాను మంగళవారంనాడిక్కడ కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్ సంతోష్లతో తొలుత సమావేశమైన అన్నామలై తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించారు.
ఢిల్లీ పోలీసులు తాజాగా ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న 9 మందిని అరెస్టు చేశారు.
ఇంట్లో ఏసీ పేలడంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఢిల్లీలో తొలిసారి జరుపుతున్న అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్లో బుధవారంనాడు కలుసుకున్నారు. ఉభయులూ 25 నిమిషాల సేపు సమావేశమయ్యారు.
కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని, త్వరలో జరుగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు.
వాహనదారులకు ఈ ఉదయాన్నే మరో గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన పంపిణీ సంస్థలు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోగ్రాముకు రూ. 2 మేర పెంచాయి.
దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని ప్రశ్నించింది.
సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు. ఇందుకోసం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరించనున్నామనీ, దేశ సరిహద్దులను మూసివేసేందుకు ఏడాదిలోగా సమగ్ర 'స్మార్ట్ బోర్డర్' పాలసీని తీసుకురానున్నామని చెప్పారు.
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల వివాదంలో ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. గతంలో వారిపై విధించిన నిషేధాన్ని, ప్రతికూల ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం సవరించింది.
ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు ఢిల్లీ హైకోర్టు మూడు రోజుల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది.