Home » New Delhi
జనవరి 28తో ప్రారంభమయ్యే తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారంనాడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ఉభయసభల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు.
జాగ్రెబ్లోని భారత రాయబార కార్యాలయంలోకి కొందరు ఖలిస్థాన్ వేర్పాటువాదులు చొరబడి విధ్వంసం సృష్టించినట్టు గురువారం ఉదయం వార్తలు వెలువడ్డాయి. భారత రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఈయూ నేతలు న్యూఢిల్లీలో పర్యటించనున్నమ వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఉద్దేశం, గతంలో తీసుకువచ్చిన 'మూడు నల్ల వ్యవసాయ చట్టాల' ఉద్దేశం ఒకటేనని రాహుల్ గాంధీ విమర్శించారు.
నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పలువురు అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశాయి. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ ఆధ్యక్ష పదవికి నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ప్రకటించింది. 45 ఏళ్ల వయసున్న నితిన్ నబీన్ ఈ పదవి అందుకోవడం ద్వారా పార్టీ చరిత్రలో అతి పిన్న అధ్యక్షుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు.
న్యూఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టంగా పొగ అలుముకుంది. వాయు నాణ్యత సూచీ 439కు పెరిగింది.
పోలింగ్ అనివార్యమైతే జనవరి 20న ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడి ఎన్నికను ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన న్యూఢిల్లీలో 28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పార్లమెంటరీ డెమాక్రసీలో స్పీకర్ పాత్ర ప్రత్యేకమైనదని ప్రధాని అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని.. ప్రజాస్వామ్యం బలంగా మార్చిందని తెలిపారు.
ధన్ఖఢ్ ఈనెల 10న వాష్రూమ్కు వెళ్లినప్పుడు రెండు సార్లు స్పృహ కోల్పోయారని, వైద్య పరీక్షలు జరపాలని వైద్యులు సూచించడంతో చెకప్ కోసం ఎయిమ్స్లో చేరారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ మూడవ ఎడిషన్ విన్నర్ ప్రశాంత్ తమాంగ్ నేడు కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. ఆయన మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.