Home » New Delhi
ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్పై ఆశలు, అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిచ్చారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంతమేరకు మినహాయింపులు ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.
ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో సమర్పిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఆదివారం రోజున బడ్జెట్ సమర్పణ జరుగుతుండటం గమనార్హం.
దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.
నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్ముడు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కిచెప్పారని మోదీ చెప్పారు.
భారతదేశంలో విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద హ్యాకథాన్గా గుర్తింపు పొందిన hackCBS 8.0 ముగిసింది. ఇందులో భారతీయ యువత రూపొందించిన ఏఐ పరిష్కారాల స్థాయి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఢిల్లీతో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త దాడిలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళా పోలీసు కమాండో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వం.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందన్నారు. ఇవాళ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పలు కీలక విషయాలు ఉన్నాయి.
ఇప్పటికే వీబీ-జీ రామ్ జీ చట్టం అమల్లోకి వచ్చినందున దానికి రివర్స్ గేర్ వేసి గతంలోకి వెళ్లలేమని కిరణ్ రిజిజు చెప్పారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ముఖ్యమైన భౌగోళిక రాజకీయ స్థిరీకరణగా ఆంటోనియా కోస్టా అభివర్ణించారు. ఈ ఒప్పందం తనకెంత ప్రత్యేకమైనదో ఆయన వివరిస్తూ ఎవరూ ఊహించని విధంగా తన జేబులోని 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును ప్రదర్శించారు.
ఐరోపా యూనియన్ నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై సుంకాన్ని 40 శాతానికి తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తోంది.