Home » Nellore
నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్య రాజకీయంగా కలకలం రేపింది. ఇటీవల జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రశేఖర్ ఏం చెబితే అదే కాకాణి మాట్లాడుతున్నారన్నారు.
జోసఫ్ రావణ్ వంటి వ్యక్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థించడం దుర్మార్గమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారంపై జగన్ స్పందించి.. భారతీయులు, అన్ని మతాల ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడితే ప్రజలు సహించరని.. మంచిని చెడుగా చూపిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 6200 ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కింద నెలకు రూ.10 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.
నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన మరబోట్లు.. తీరానికి అతిసమీపానికి వస్తూ హల్చల్ చేశాయి.
మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అడ్డొచ్చిన వారిని మూసీలో వేసి తొక్కి మరీ ప్రక్షాళన చేసి తీరతామని ప్రకటించారు.
బారా షహీద్ దర్గాలో శనివారం అర్ధరాత్రి ఘనంగా గంధ మహోత్సవం ప్రారంభమైంది. నగరంలోని కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 పాత్రలలో గంధాన్ని పూల రథంలో మేళ తాళాలతో ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు.
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన అన్నాచెల్లెళ్లు అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు.