Home » Nellore
బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
మెుంథా తుపాన్ దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
నాగుల చవితి నాడు అరుదైన దృశ్యం అగుపించింది. పర్వదిన వేళ రెండు నాగు పాములు ఒకేసారి శివలింగాన్ని చుట్టుకొని భక్తులను ఆశ్చర్యపరిచాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వేగేట్ వద్ద ఉన్న విశ్వనాథ స్వామి ఆలయంలో
చంద్రబాబును ఎదుర్కోలేక, అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేక.. బాలకృష్ణను తాగుబోతు అని జగన్ విమర్శలు చేశారని కోటంరెడ్డి మండిపడ్డారు.
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం కావడం అందరినీ కలచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో బెంగళూరులో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల రమేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి.. గత రాత్రి ట్రావెల్స్ బస్సులో బెంగుళూరుకు పయనమయ్యాడు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
నెల్లూరు జిల్లా దారకానిపాడు మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు నెల్లూరులో పర్యటించారు.
నగరంలోని బ్లూ మూన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.