Home » NCP
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్లో వారిద్దరూ సమావేశమయ్యారు.
మహారాష్ట్ర(maharashtra)లో మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్(drunk and drive) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూణెలోని మంజ్రీ ముంధ్వా రోడ్డులో కోళ్లతో వెళ్తున్న టెంపోను ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది(accident). మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మాజీ NCP కార్పొరేటర్ బందు గైక్వాడ్ కుమారుడు కావడం విశేషం.
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్సీపీతో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' ఒక రిపోర్ట్లో తెలిపింది.
మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. అజిత్ పవార్ సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్ యూనిట్ చీఫ్ అజిత్ గవాహనేతోపాటు యష్ సానే, రాహుల్ బోంస్లే, పంకజ్ బాలేఖర్లు బుధవారం రాజీనామా చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ గురువారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బారామతి లోక్సభ స్థానం నుంచి సునేత్ర పవార్ బరిలో దిగారు.
లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య(Ayodhya)ఉన్న ఫైజాబాద్లో బీజేపీ ఓటమిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. రాముడి పేరుతో రాజకీయాలు చేయాలని చూసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎన్సీపీ నేత శరద్ పవార్(Sharad Pawar) విమర్శించారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రి వర్గంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించారు. కానీ మోదీ కేబినెట్లో అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీకి అవకాశం దక్కలేదు.
మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కీలకమైన బారామతి లోక్సభ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి సునేత్ర పవార్పై ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సులే అధిక్యంలో కొనసాగుతున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఆ పార్టీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈశాన్య రాష్ట్రంలో ఎన్సీపీ గెలువడంతో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై ఆ నియోజకవర్గం ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిలో సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు సీసీటీవీలను స్విచ్ఛాప్ చేశారని ఆమె ఆరోపించారు.