Home » National News
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగడం అత్యంత కీలకమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దు పరిస్థితులు ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై నేరుగా ప్రభావం చూపుతాయని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ సమావేశాల్లో ఇప్పటివరకు 19 బిల్లులు ఆమోదం పొందాయి.
పాన్ మసాలా తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాన్ మసాలా ప్యాకేజింగ్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
జాతీయ విపత్తు నివారణ నిధి కింద మొత్తం 18 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 18 నగరాలకు ఆర్థికసాయం చేసేందుకు ఏకంగా రూ.5,520.07 కోట్లను ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించింది.
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. ఆగస్టు 15న జెండా పండుగను ప్రజలంతా సగర్వంగా నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
భారత జాతీయ గీతం 'జన గణ మన' తరహాలోనే 'వందేమాతరం'కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యులకు పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో నగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో బేసిక్ రూమ్ రెంట్ అదే ప్రాంతంలోని 3-స్టార్ హోటళ్లలో వసూలు చేస్తున్న సగటు అద్దెను మించకూడదని సిఫారసు చేసింది.
ఓ బ్యాంకు లాకర్లో దాచిన బంగారు, వెండి నగలు కనిపించకుండా పోయిన ఘటన ఉత్తరప్రదేశ్లో కలకలం రేపుతోంది. కొన్నేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచి రూ.50లక్షల విలువైన నగలను లాకర్లో దాచగా.. తాజాగా అవి అదృశ్యమయ్యాయి.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ, చిన్నారితో కలిసి పడవలో ఉన్న రాహుల్ గాంధీ ఫొటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 157 మంది మృతిచెందగా.. 257 మంది గల్లంతయ్యారు.