Home » National News
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బెంగాల్ను నాశనం చేసే ప్రయత్నంలో ఆ పార్టీ దేశంలోనే అధికారంలో లేకుండా పోతుందని అన్నారు. ఢిల్లీని పట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను తాను ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(శనివారం) నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం జేవర్ సమీపంలో రూ.11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్-1 దశను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు.
మహరాష్ట్ర చంద్రాపూర్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉండి కన్నతండ్రినే చంపేసింది ఓ యువతి. ప్రేమకు అడ్డు చెప్పాడని ఏకంగా ప్రాణాలే తీసేసింది.
ఏ కష్టం వచ్చిందో ఏమోకానీ..ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. దీనిపై ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులతో రెండవ జాబితాను అన్నాడీఎంకే శుక్రవారంనాడు ప్రకటించింది. ఈ జాబితాలో 127 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఎరువులపై యుద్ధ ప్రభావం పడకుండా రైతుల అవసరాలకు సరిపడా సరఫరా చేస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్చి 30న సీఎం, ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు.