Home » National News
టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో మంగళవారంనాడు చేరారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
బీహార్లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది.
దేశంలో నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలున్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరి కాదని అన్నారు.
తనకు రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో విజయ్ పేర్కొన్నారు. తన భార్య సంగీతకు రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామికి ఉద్వాసన పలకాలని, తద్వారా బీజేపీ మాయమాటలకు తమిళనాడు లొంగదని బలంగా చాటిచెప్పాలని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు బీజేపీ పరోక్షంగా మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్కు, సీపీఎం-బీజేపీ కంబైన్కు మధ్యే జరగనుందని అన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్కుమార్కు సమర్పించారు.
రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారంనాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్కు అందజేశారు.
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీకి సోమవారంనాడు నామినేషన్ వేశారు. తూర్పు తిరుచ్చి నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.