Home » National News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
తొలి ఎన్నికల్లోనే తమిళనాట తిరుగులేని అదరణతో అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే పొరుగున ఉన్న కేరళంలో రాజకీయ విస్తరణ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కేరళలోని విజయ్ అభిమానులు పలువురు పాలక్కాడ్లో ఆదివారంనాడు సమావేశమయ్యారు.
గోవుల అక్రమ రవాణాపై బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. ఈ నేపథ్యంలో పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని బీజేపీకి కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే రేఖా పాత్ర అడ్డుకున్నారు. కబేళాకు తరలించాలంటే ఆవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందేనని పట్టుపట్టారు.
కేరళలో యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్, మరో 20 మంది క్యాబినెట్ మంత్రులు మే 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సతీశన్ ఆదివారంనాడు లోక్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు సమర్పించారు.
ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై బీజేపీ సారథ్యంలోని గోవా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. ప్రభుత్వాధికారుల విదేశీ పర్యటనపై నిషేధం విధించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. పరీక్షా వ్యవస్థలోనే ఉన్న 'ఇన్సైడర్లు' ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేసి, మధ్యవర్తుల ద్వారా దేశంలోని పలుచోట్ల విద్యార్థులకు విక్రయించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక్కసారిగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యే రాజ్ మోహన్కి ఫిల్మ్ టెక్నాలజీ & సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ అప్పగించడంపై ప్రముఖ సినీ హీరో విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేరళలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈనెల 18వ తేదీ సోమవారంనాడు ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతోంది.
నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో అక్రమ కట్టడాల కూల్చివేతకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి 'బుల్డోజర్ యాక్షన్'కు దిగింది. జిల్లా మెజిస్ట్రేట్ (DM) కార్యాలయం వెలుపల 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత పనులు ప్రారంభం కావడంతో ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకుంది.