Home » National News
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి దశలో అధికార, విపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మంగళవారం పార్లమెంట్ ద్వారం వద్ద విపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.
కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించారు.
మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను పంజాబ్లో ‘జాంబీ డ్రగ్’ సమస్యకు నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో పంజాబ్లో ఆప్, బీజేపీ మధ్య కొత్త రాజకీయ వివాదానికి కారణమైంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతాన్ని వరదనీరు ముంచెత్తింది. వరద ధాటికి ఇనుప వంతెన క్షణాల్లో కొట్టుకుపోగా.. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసు చర్యలపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధమేనని తెలిపారు.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎల్.ఖియాంగ్టేను ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి విద్యార్థులు భారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎల్.ఖియాంగ్టేను అదుపులోకి తీసుకున్నారు.
రైల్వే క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి ఫోన్ కాల్తో రైలును ఆపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు వచ్చిన అతను.. స్టేషన్కు వెళ్లక ముందే దానిని ఆపేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, మోసపూరిత కాల్స్ను అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో కీలక చర్య తీసుకుంది.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాళ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది