Home » Nalgonda
యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. ప్రచార శాఖలో దాదాపు రూ.10లక్షల విలువైన డాలర్లు అదృశ్యమైనట్టు ఆడిట్లో బయటపడింది.
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలో 65వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్పైకి దూసుకెళ్లింది.
తాను విద్యాశాఖ మంత్రిని అయితే కార్పోరేట్ స్కూళ్లను మూసివేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్య వ్యాపారం కావద్దని తేల్చిచెప్పారు. బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించారు.
నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు ‘శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి’ దేవస్థానములో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని ప్రభుత్య పాఠశాలలకు కాంట్రాక్టర్లు తాళాలు వేశారు. మన ఊరు - మన బడి నిర్మాణ భవనానికి సంబంధించిన బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు ఈ చర్యలకు పాల్పడ్డారు.
సూర్యాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఐదుగురు టీచర్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది.
సంక్రాంతి రిటర్న్ జర్నీలో రద్దీ నియంత్రణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 65వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపట్టారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
కోదాడ పట్టణంలో కస్టోడియల్ డెత్ మృతుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ పరామర్శించారు. రాజేష్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, మృతికి కారుకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
లాకప్ డెత్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సురేశ్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేయడంపై మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సైను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని మండిపడ్డారు.