Home » Nadendla Manohar
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.
ఈ నెల 25వ తేదీనుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈనెల 25వ తేదీన 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చెనెల 15 తేదీ వరకు నాలుగు విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఏటీఎం కార్టు సైజులో నూతన రేషన్ కార్డులు ఉండబోతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు..
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
మనుషులనే కారుతో తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది, తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని రోడ్డుపైవేసి తొక్కిస్తావా? నీకు నువ్వే సమస్యలు సృష్టించి, అలజడులు రేపి, దాడులకు పాల్పడతానంటే ఈ ప్రభుత్వంలో కుదరదు.
రాజకీయ నాయకుల ఫొటోలు.. పార్టీ జెండాల రంగులూ లేకుండా సరికొత్త యూనిఫాంను కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
తెనాలి మహిళలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో భూరి విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇటీవలే పట్టణంలో రూ. 6 కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో మహిళలే దాన మివ్వగా..
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీని పునఃప్రారంభించిన వారం రోజుల్లోనే కోటికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తెనాలిలో పోలీసులపై దాడిచేసిన నేరస్తులకు కులం లేదా మతం ఏ ప్రయోజనమూ లేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు వేస్తూ బాధితులకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు.