Home » Nadendla Manohar
రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు పౌర సరఫరాల శాఖ సరికొత్త విధానం ప్రవేశ పెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్పాట్లోనే బియ్యాన్ని పరీక్షించేందుకు అందుబాటులోకి మొబైల్ కిట్లు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మొబైల్ కిడ్స్ ద్వారా బియ్యాన్ని త్వరితగతిన పరీక్షించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అవినీతిలోకి నెట్టేసిందని ఆరోపించారు
యువత కలలు సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.యువతకి తానూ ఏ సమయంలోనైనా అండగా ఉంటానని పేర్కొన్నారు.
టెక్నాలజీ వాడి పౌర సరఫరాల వ్యవస్థను పారదర్శకత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్మార్ట్ రైస్ కార్డులను అందించడం సహా ఈపోస్ యంత్రాలను ఆధునీకరించి అందిస్తున్నామని తెలిపారు.
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.
ఈ నెల 25వ తేదీనుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈనెల 25వ తేదీన 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చెనెల 15 తేదీ వరకు నాలుగు విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఏటీఎం కార్టు సైజులో నూతన రేషన్ కార్డులు ఉండబోతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు..
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
మనుషులనే కారుతో తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది, తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని రోడ్డుపైవేసి తొక్కిస్తావా? నీకు నువ్వే సమస్యలు సృష్టించి, అలజడులు రేపి, దాడులకు పాల్పడతానంటే ఈ ప్రభుత్వంలో కుదరదు.
రాజకీయ నాయకుల ఫొటోలు.. పార్టీ జెండాల రంగులూ లేకుండా సరికొత్త యూనిఫాంను కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.