Home » Nadendla Manohar
తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ శాసనమండలిలో ప్రకటన ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంపై ఛైర్మన్ను కలిసిన మంత్రులు.. స్టేట్మెంట్కు సిద్ధమంటూ రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంపై ఎమ్మెల్యే రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు.
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, అటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
క్షేత్రస్థాయిలో రైతులకు ఒక భద్రత ఒక నమ్మకం కూటమి ప్రభుత్వం కలిగించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ధైర్యంగా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోగలం అనే నమ్మకాన్ని కల్పించామని తెలిపారు.
రాయచోటి మార్పు వ్యహారంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చాలా బాధపడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రిమండలి తరవాత కూడా రాంప్రసాద్ రెడ్డిని పిలిచారన్నారు.
రికార్డు స్థాయిలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి 11 ట్రైన్లు పెట్టి ధాన్యం ఇతర జిల్లాలకు తరలించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్ధపు కథనాలు పత్రికలలో రాస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు కష్టించి పండించిన ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు.
ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంటే రూ.12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు.
ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.