Home » Municipal elections
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నిక చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో అధికారులు వాయిదా వేశారు.
నిర్మల్, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో భార్యాభర్తలకే చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడం విశేషంగా మారింది. ఈ ఫలితాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి..
నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ స్పందించారు.
కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. మేయర్గా సీపీఐ, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్లు దక్కించుకున్నారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కుర్చీ కొట్లాట కొనసాగుతోంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్గా మోగదాల పావని రమేష్ గౌడ్ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ అనుచరులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ మున్సిపల్ పీఠాలకు ఇవాళ కుర్చీలాట జరుగుతోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు ఇవాళ జరిగాయి. ఇక, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియలో మాత్రం అనేక రకాల టర్న్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏయే పరిణామాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయో చూద్దాం..
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో నూతన చైర్మన్ పట్టాభిషేకం ఖరారైంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంపు రాజకీయాలతో అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్లతో పాటు, ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. ఆదివారం హైదరాబాద్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్పై ఉత్కంఠ వీడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి సమావేశం కావడంతో ఉత్కంఠకు తెరపడింది. కొత్తగూడెం కార్పొరేషన్ అంశంపై చర్చించిన నేతలిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు.