Home » Mumbai
అక్టోబర్ 25 నుంచి 29 వరకూ కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్ ఈవెంట్కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది.
ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుండి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేసారు.
బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు ముంబైలో ఘన స్వాగతం దక్కింది. ముంబైలో వ్యాపార వేత్తలతో కీర్ సమావేశమయ్యారు. రేపు ప్రధానితో భేటీ ఉంటుంది. తన పర్యటన గురించి, కీర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నందున ప్రభుత్వానికి 4 లక్షల 31 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్లో ఆమె GIFT..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబైలో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను ఆయన కలువనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్.
మహారాష్ట్ర విజయ్ ర్యాలీ గత జూలైలో జరిగినప్పుడు ఠాక్రే సోదరులిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇద్దరు నేతలూ పలుమార్లు సమావేశమయ్యారు. గత నెలలో రాజ్ నివాసమైన శివ్తీర్ధ్కు ఉద్ధవ్ వెళ్లి కలుసున్నారు.
బ్లిన్కిట్ డెలివరీ బాయ్ ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకరాని చోట తాకాడు. అక్టోబర్ 3వ తేదీన రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
భారత విమానయాన రంగంలో మరో కీలక మలుపు. ప్రధాని మోదీ అక్టోబర్ 8, 2025న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. దీంతో ముంబై.. లండన్, న్యూయార్క్, టోక్యోలతో జతచేరుతుంది.
ఆటోను అక్కడే ఆపేసి కిందకు దిగి పరుగులు పెట్టాడు. హోర్డింగ్ ఆటో ముందు భాగంలో పడింది. ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ఆటో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకు ఏమీ కాలేదు.
ముంబై ఉగ్రదాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరం బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ప్రపంచం అంతా యుద్ధం ప్రారంభించవద్దని చెప్పడానికి ఢిల్లీకి వస్తోందని, నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ ప్రత్యేకంగా తనను, ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చారని చిదంబరం తెలిపారు.