Home » Mumbai Indians
టీమిండియా స్టార్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ అభివాదం చేస్తుండగా.. ఇద్దరు అభిమానులు అతని చేతి గడియారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య లఖ్నవూతో జరిగిన మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. కాగా బెంగళూరుతో జరిగే కీలక పోరుకు పాండ్య బరిలోకి దిగే అవకాశం ఉంది.
టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతని భార్య దేవిశా శెట్టి ఇవాళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
రాయ్పుర్ వేదికగా మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంఐ తలపడనుంది. అందులో భాగంగా రాయ్పుర్ వెళ్లేందుకు ముంబై ఆటగాళ్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కానీ అందులో హార్దిక్ పాండ్య కనిపించలేదు. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై వేటు పడిందా? అనే చర్చ మొదలైంది.
ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్నవూ సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. నిన్న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిపై లఖ్నవూ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లఖ్నవూ సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఒక భావోద్వేగపూరితమైన సన్నివేశం చోటుచేసుకుంది.
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతోన్న మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎల్ఎస్జీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ముంబైకి 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఎంఐ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లఖ్నవూ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలై ఎంఐ ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.