Home » MLA
రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వరద జలాలతో నింపి కరువు సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
‘నాకు ఏమైనా జరిగితే అందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి పేర్కొన్నారు. అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్లు, ఆఫ్లైన్ బెట్టింగ్ల ఆరోపణల మేరకు ఈడీ అధికారులు గత వారం దాడి చేసి రూ.12 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాజులరామారం డివిజన్ ఆదర్శనగర్ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరిందని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆ కాలనీకి వెళ్లి వరద నీటి సమస్యను పరిశీలించారు.
ద ప్రజలు శుభకార్యాలు జరుపుకునే ఫంక్షన్ హాల్ నిర్వహణ ఇలాగేనా అంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆయన కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి కేపీహెచ్బీ నాలుగో ఫేజ్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను పరిశీలించారు.
పేద ప్రజలపై అధికంగా ఆస్తిపన్నులు వేసి ఆర్ధిక భారం మోపొద్దని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నర్సింహ, మల్లారెడ్డిలను ఆయన మంగళవారం కలిశారు.
రాష్ట్రంలో ప్రజారోగ్యా నికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఇంటరాగేషన్ నుంచి తప్పించుకునే సమయంలో జిబాన్ సహా తన మొబైల్ను మురుగు కాలువలోకి విసిరేయడంతో దానిని ఈడీ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి తాజాగా ఈడీ రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టింది.
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ బెయిల్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని.. అనవసరంగా నన్ను కెలకొద్దంటూ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యమని, ప్రతి పేద వారి కుటుంబం బంగారు కుటుంబం కావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.