Home » MLA
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యంతో కా కుండా దొడ్డు బియ్యం భోజనమే వడ్డిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె బడంగ్పేట్ కార్పొరేషన్లోని నాదర్గుల్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కూకట్పల్లిలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లిలోని హనుమాన్దేవాలయం వద్ద బతుకమ్మ ఆడే స్థలాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ లబ్ధిదారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయలతోపాటు ఒక తులం బంగారం లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలి బతుకమ్మ (ఎంగిలిపూల బతుకమ్మ కూకట్పల్లిలో అమావాస్యకు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతిప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంబర్ నుంచి మంత్రి లోకేష్ బయటకు వస్తున్న సమయంలో లాబీల్లో ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్ హడావుడి చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట్, పహాడిషరీఫ్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆమె పరిశీలించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నంజేగౌడ గెలుపును బీజేపీ అభ్యర్థి కేఎస్ మంజునాధ్ గౌడ హైకోర్టులో సవాలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఫలితాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.
డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్ డివైస్ లను పంపిణీ చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు మాజీ మంత్రి హరీశ్రావును సోమవారం కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రైతులు భూములు కోల్పోకుండా అలైన్మెంట్లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు.
మహిళల ఆర్థిక సాధికారతలో ఆంధ్రప్రదేశ దేశానికి ఆదర్శంగా నిలు స్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుప తిలో జరిగిన రెండు రోజుల జాతీయ పార్ల మెంటరీ శాసనసభ కమిటీల తొలిమహిళా జా తీయ సదస్సు ముగింపు సందర్భంగా సోమ వారం ఆమె మాట్లాడారు. తిరుపతిలో మహిళా సాధికారతపై తీర్మానం ఆమోదించడం చరి త్రా త్మకం అన్నారు.