Home » Minister Nara Lokesh
ఉన్నత విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి లోకేష్ పరిశీలించనున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు.
సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన నివాళులర్పించారు.
మంత్రి లోకేశ్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
మొంథా తుఫాను దృష్ట్యా వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని మంత్రికి అధికారులు వివరించారు.
మొంథా తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో ఈరోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ సూచించారు.