Home » Minister Nara Lokesh
సత్యనారాయణ మాస్టరుపై మంత్రి లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం తన సొంత నిధులు, దాతల సహాయంతో స్కూల్ను తీర్చిదిద్దారని కొనియాడారు.
హెరిటేజ్కి.. వీఎస్ఆర్ ఏవియేషన్కి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టారని.. ఇప్పుడు కూడా వీఎస్ఆర్ ఏవియేషన్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అలాంటివేనని ధ్వజమెత్తారు.
నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
గుంటూరు ఛానల్ ఆధునీకరణపై ఎమ్మెల్సీ హనుమంతరావు ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. ఈ ఛానల్ను మెరుగుపరిచేందుకు 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని.. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.
రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్పై ఫేక్ ప్రచారం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు..
ఏపీ మంత్రి నారా లోకేశ్ కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులతో నిర్వహించిన విందు సమావేశం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా సాగింది. శుక్రవారం లోకేశ్ ఉండవల్లి నివాసంలో రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు..
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శ్రీవారికి చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు' జగన్ అని ధ్వజమెత్తారు.
ఏపీ శాసనమండలిలో వైసీపీ చేసింది మహాపచారం అంటూ ఛైర్మన్ ఛాంబర్ వద్ద ఎన్డీఏ సభ్యులు నిరసనకు దిగారు. హిందూమతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఛైర్మన్కు తెలిపారు కూటమి సభ్యులు.
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.