Home » Minister Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతోందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించి చూపామని అన్నారు. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ అని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.
గురువులు దేవుడితో సమానమని.. అందరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
తెలుగు జర్నలిజంలో కలికితురాయి.. డైనమిక్ పర్సన్.. భయమెరుగని మేరునగధీరుడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు మొదలు.. సామాన్యుల వరకు..
AP EDCET 2025: ఏపీ ఎడ్సెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు.
Lokesh Meets Tony Blair: ఏపీ విద్యా శాఖ, టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు.
తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. చట్టప్రకారం అందరికీ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్ బుక్లో ఉన్నాయని నారా లోకేష్ చెప్పారు.
Minister Lokesh Delhi Visit: ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను మంత్రి నారా లోకేష్ కలువనున్నారు. ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతితో మంత్రి సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు ఢిల్లీలో బిజీ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు లోకేష్ షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు.
CM Chandrababu: ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నామన్నారు.
నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశస్థాయిలో నిర్వహించిన పోటీపరీక్షలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు.